హైదరాబాద్: స్వదేశంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో జరగనున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్ల షెడ్యూల్ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. సుదీర్ఘమైన ఈ హోం సీజన్ సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో సిరీస్ సెప్టెంబర్ 17న, కివీస్తో సిరీస్ అక్టోబర్ 22న ప్రారంభం కానుంది.

ఆస్ట్రేలియాతో ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న టీమిండియా కివీస్తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరిస్ కోసం కొత్తగా గౌహతి, తిరువనంతపురం రెండు వేదికలను సిద్ధం చేశారు. ఈ సిరిస్లలో ఈ రెండు వేదికలు రెండు టీ20లకు ఆతిథ్యమివ్వనున్నాయి.
సెప్టెంబర్ 12న చెన్నైలో బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ మ్యాచ్తో ఆసీస్ జట్టు వార్మప్ మ్యాచ్తో సిరిస్ మొదలవుతుంది. మరోవైపు భారత్-ఆస్ట్రేలియా సిరీస్లో ఐసీసీ పాత నిబంధనలే ఉపయోగించనుంది. ఐసీసీ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 28 నుంచి అమల్లోకి వస్తున్నప్పటికీ, వాటి ప్రభావం మాత్రం ఈ సిరీస్పై ఉండడం లేదు.
Full schedule:
Against Australia:
Sep 12: Warm-up match in Chennai
Sep 17: 1st ODI in Chennai
Sep 21: 2nd ODI in Kolkata
Sep 24: 3rd ODI in Indore
Sep 28: 4th ODI in Bengaluru
Oct 1: 5th ODI in Nagpur
Oct 7: 1st T20I in Ranchi
Oct 10: 2nd T20I in Guwahati
Oct 13: 3rd T20I in Hyderabad.
Against New Zealand:
Oct 17: 1st warm-up match at CCI, Mumbai
Oct 19: 2nd Warm-up match at CCI, Mumbai
Oct 22: 1st ODI in Mumbai
Oct 25: 2nd ODI in Pune
Oct 29: 3rd ODI (to be hosted by UPCA)
Nov 1: 1st T20I in Delhi
Nov 4: 2nd T20I in Rajkot
Nov 7: 3rd T20I in Thiruvananthapuram.
All Matches will be broadcast on StarSports.