
భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా సునాయాసంగా జరిగింది. మూడోరోజు ఆట మొదలైన గట వ్యవధిలోనే ఈ మ్యాచ్ ముగియడం గమనార్హం. రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసిన ఆసీస్ జట్టు.. అదే రోజులో భారత్ను కూడా ఆలౌట్ చేసింది. భారత బ్యాటర్లలో పుజారా మినహా అందరూ విఫలమయ్యారు. కానీ అతనికి ఎవరూ తోడు లేకపోవడంతో భారత జట్టు ఏమాత్రం రాణించలేదు. ఈ క్రమంలోనే కేవలం 76 పరుగుల ఆధిక్యాన్ని మాత్రమే సాధించింది.
స్వల్ప లక్ష్య ఛేదన కోసం మూడో రోజు బరిలో దిగిన ఆసీస్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్లో రాణించి అర్ధశతకం చేసిన ఉస్మాన్ ఖవాజా ఈ ఇన్నింగ్సులో కేవలం డకౌట్ అయ్యాడు. అతన్ని అవుట్ చేసిన అశ్విన్.. భారత్కు బ్రేక్ ఇచ్చాడు. కానీ ఖవాజా వెనుతిరగడంతో వచ్చిన లబుషేన్ మరింత పట్టుదలగా ఆడాడు. అతని కాన్ఫిడెన్స్ ఆట చూస్తే కాపేససిటికే మ్యాచ్ ముగుస్తుందని అందరికీ అర్థం తెలిసిపోయింది. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (49 నాటౌట్) కూడా చక్కని ఇన్నింగ్స్ ఆడాడు.
లబుషేన్ (28 నాటౌట్), ట్రావిస్ హెడ్ అద్భుతంగా ఆడటంతో మూడో రోజు ఆట ప్రారంభమైన గంటలోనే ఆసీస్ నెగ్గింది. హెడ్ తన హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలోనే ఉన్నప్పటికీ తనకు స్ట్రైకింగ్ ఇవ్వాలని అతను అడగలేదు. ఈ క్రమంలో వేగంగా ఆడిన లబుషేన్.. బౌండరీతో మ్యాచ్ ముగించి విజయోత్సాహాన్ని ప్రదర్శించాడు. దీంతో భారత గడ్డపై స్మిత్ సారధ్యంలో టీమిందియాను ఓడించింది. ఈ మ్యాచ్లో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా నెగ్గింది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన పోరాటంతో భారత్ ఆధిక్యాన్ని ఆసీస్ 2-1కు తగ్గించారు. ఇక ఈ సిరీసులో చివరిదైన నాలుగో టెస్టు అహ్మదాాద్ వేదికగా జరగనుంది.