న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఈ ఇరుదేశాలతో పాటు ప్రపంచ దేశాల అభిమానులు కూడా అత్యంత ఆసక్తిగా తిలకిస్తాయి. అందులోనూ ప్రపంచకప్లో జరిగిన మ్యాచ్ అయితే.. ఆ మాత్రం క్రేజ్ భారీ స్థాయిలో ఉంటుంది. ఇందుకు నిదర్శనమే ప్రపంచ కప్ 2015లో పాకిస్థాన్-ఇండియా మ్యాచ్.
ఈ దాయాదుల సమరాన్ని ప్రత్యక్షంగా చూడడానికి వచ్చిన అభిమానులతో మొన్న అడిలైడ్ స్టేడియం ఎలా కిక్కిరిసిపోయింది. కాగా, టీవీల్లో వీక్షించే వారి సంఖ్య భారీ స్థాయిలో పెరిగిందని ప్రపంచకప్ అధికారిక ప్రసారకర్త స్టార్ ఇండియా పేర్కొంది.
ఈ మ్యాచ్కు ఒక్క భారత్ నుంచే హాట్స్టార్, స్టార్స్పోర్ట్స్ ఛానెళ్ల ద్వారా 2.5 కోట్ల వీక్షణలు నమోదయ్యాయట.సగటున 10 నుంచి 12 నిమిషాల పాటు ఇంత ట్రాఫిక్తో ప్రసారాలు జరిగాయట. ప్రఖ్యాత అమెరికన్ ఫుట్బాల్ సూపర్ బౌల్ (50 లక్షలు) కంటే ఇది ఐదు రెట్లు అధికంగా జనాదరణ పొందింది.
కాగా, నిరుటి ఇండియన్ ప్రీమియరల్ లీగ్ సీజన్ మొత్తానికి 6 కోట్ల వీక్షణలు రాగా, ఈసారి కొత్తగా ఆన్లైన్ అప్లికేషన్ హాట్స్టార్ రావడంతో ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని ఈ లీగ్ ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్ ఇండియా తెలిపింది.