Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: భారత్ vs పాక్.. రోహిత్ శర్మ ఎంత స్కోర్ చేస్తాడో చెప్పిన జ్యోతిష్కుడు!

IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్లూ కాసేపట్లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. న్యూజిలాండ్ చేతిలో ఓడిన పాకిస్థాన్ భారత్ తో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ పై గెలిచిన భారత్.. పాక్ పై గెలిచి సులభంగా సెమీ ఫైనల్ కు చేరుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో రోహిత్ శర్మపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ క్రమంలో భారత్-పాక్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆట గురించి ప్రముఖ జ్యోతిష్కుడు సుమిత్ బజాజ్ తన అంచనాను పంచుకున్నారు. కీలకమైన మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ టీమ్ ఇండియాకు కీలకం అవుతుందని సుమిత్ బజాజ్ సూచించారు. స్టార్ ఓపెనర్ 50 పరుగుల మార్కును దాటాలని, భారీ స్కోరు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ తన బ్యాటింగ్ లో 26-29, 55-57 స్కోర్ల వద్ద ప్రతిఘటనను ఎదుర్కోవచ్చని సుమిత్ బజాజ్ అంచనా వేశారు. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ 41 పరుగుల చేసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(101) అద్భుతమైన సెంచరీతో అజేయంగా నిలిచాడు. బంగ్లాదేశ్ పై ఆరు వికెట్ల తేడాతో భారత్ గెలవడంలో గిల్ కీలక పాత్ర పోషించాడు.

Astrology Expert Predicts Rohit Sharma s Performance in India vs Pakistan Champions Trophy Match

2023 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి జ్యోతిష్కుడు సుమిత్ బజాజ్ అంచనా నిజమైంది. అప్పట్లో ఓ మ్యాచ్ కు ముందు ఏస్ బ్యాటర్ అత్యధిక వన్డే సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్ధలు కొడతాడని సరిగ్గా అంచనా వేశారు. ఈ టోర్నమెంట్ లో కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచే అవకాశం ఉందని కూడా చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే విరాట్ కోహ్లీ 765 పరుగులు చేయడంతో ఆ జోస్యం నిజమైంది. ఆ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.

ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, ఆల్ రౌండర్ సల్మాన్ ఆఘా, బ్యాటర్ సౌద్ షకీల్ భారత్ కు సవాల్ విసరగలరని సుమిత్ బజాజ్ ఏ ప్రత్యేక పోస్ట్ లో అభిప్రాయపడ్డాడు. భారత బౌలర్లు ముగ్గురు బ్యాటర్లను ముందుగానే ఔట్ చేయాలని ఆయన పేర్కొన్నారు. మ్యాచ్ పై నియంత్రణ సాధించడానికి వారిని త్వరగా ఔట్ చేయాలన్నారు.

2025 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, ఆల్ రౌండర్ సల్మాన్ ఆఘా, బ్యాటర్ సౌద్ షకీల్ భారతదేశానికి సవాలు విసరగలరని సుమిత్ బజాజ్ ఒక ప్రత్యేక పోస్ట్‌లో అభిప్రాయపడ్డారు. భారత బౌలర్లు ముగ్గురు బ్యాటర్లను ముందుగానే అవుట్ చేయాలని అతను భావించాడు. ప్రముఖ జ్యోతిష్కుడు వికెట్లు పడటానికి తాను అంచనా వేసిన సమయాన్ని కూడా పంచుకున్నారు.

Story first published: Sunday, February 23, 2025, 13:20 [IST]
Other articles published on Feb 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+