బెంగళూరు: భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 ప్రపంచ కప్ ముందు జరిగే సమరానికి ముహూర్తం ఖరారైంది. ఆసియా కప్లో భాగంగా ఈ రెండు జట్లు ఫిబ్రవరి 27న తలపడనున్నాయి. ఫిబ్రవరి 24న ఆతిథ్య బంగ్లాదేశ్, భారత్ మధ్య పోరుతో టోర్నీ ప్రారంభం కానుంది.
భారత జట్టు మార్చి 1న శ్రీలంకతో తలపడనుంది. టోర్నీలో మరో బెర్తు కోసం క్వాలిఫయింగ్ టోర్నీలో నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో తొలిసారి టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ను నిర్వహించనున్నారు. టీ20 ప్రపంచకప్లో మార్చి 19న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.

ఫిబ్రవరి 24 (బుధవారం) - భారత్ వర్సెస్ బంగ్లాదేశ్
ఫిబ్రవరి 27 (శనివారం) - భారత్ వర్సెస్ పాకిస్తాన్
మార్చి 1 (మంగళవారం) - భారత్ వర్సెస్ శ్రీలంక
మార్చి 3 (గురువారం) - క్వాలిఫయర్తో పోటీ