న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పొరబాటు పడ్డాను.. ఆ సమీక్షకు వెళ్లాల్సింది కాదు'

ASIA CUP 2018 :Twitter Criticizes KL Rahul For Wasting The Review As MS Dhoni Could Not Use It
Asia Cup: Frustrating at times but cant sulk: Rahul on ODI career

న్యూ ఢిల్లీ: ఆసియాకప్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పసికూన అఫ్గానిస్తాన్‌ బలమైన భారత్‌ను ఓడించినంత పనిచేసిన విషయం తెలిసిందే. సులువుగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌ అంపైర్‌ తప్పిదాలతో భారత్‌ డ్రాతో సరిపెట్టుకుంది. అద్యాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌ చాలా రోజుల తర్వాత ప్రేక్షకులకు అసలు సిసలు క్రికెట్‌ మ్యాచ్‌ రుచి చూపించింది.

ధోని, కార్తీక్‌లు కొద్దిసేపు క్రీజులో ఉంటే

ధోని, కార్తీక్‌లు కొద్దిసేపు క్రీజులో ఉంటే

మ్యాచ్‌ అనంతరం అభిమానులు ఎవరికి తోసిన విశ్లేషణలు వారు చేస్తున్నారు. ‘ఛ.. ధోని, కార్తీక్‌లు కొద్దిసేపు క్రీజులో ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు.. అంపైర్‌ తప్పుడు నిర్ణయం సవాల్‌ చేసే అవకాశం లేకపోయింది. కేఎల్‌ రాహుల్‌ ఉన్న ఒక్క రివ్యూ వృథా చేశాడు.' అని అతనిపై ట్వీట్లు సంధించి నిందిస్తున్నారు. ధోని ఔట్‌ కావడానికి కూడా రాహులే కారణమంటూ మండిపడుతున్నారు.

రివ్యూకు తీసుకోవాల్సింది కాదని

రివ్యూకు తీసుకోవాల్సింది కాదని

కేఎల్‌ రాహుల్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తాను రివ్యూకు తీసుకోవాల్సింది కాదని చెప్పుకొచ్చాడు. ‘ఒకే రివ్యూ అవకాశం ఉన్నప్పుడు చాలా కష్టం. కానీ నేను ఆ సమీక్షకు వెళ్లాల్సింది కాదు. కానీ ఆ సమయంలో బంతి అవతలివైపు వెళ్లిందో ఏమో అని భావించాను. అలా వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకున్నాను.'

జడేజా,దీపక్‌ చాహల్‌ పోరాటం కూడా

జడేజా,దీపక్‌ చాహల్‌ పోరాటం కూడా

'మేం బాధపడటం లేదు బంతి నెమ్మదిగా స్పిన్‌ అవుతోంది. ఇది మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌కు చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో కూడా దినేశ్‌ కార్తీక్‌ అద్భుతంగా ఆడాడు. కేదార్‌ జాదవ్‌తో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో జడేజా,దీపక్‌ చాహల్‌ పోరాటం కూడా ఆకట్టుకుంది. ఓపెనర్‌గా బరిలోకి దిగినప్పుడే మిడిలార్డర్‌పై ఒత్తిడి లేకుండా చేయాలనుకున్నాను' అని తెలిపాడు.

అఫ్గాన్‌ సంచలనం రషీద్ ఖాన్.. జడేజాను బోల్తా

అఫ్గాన్‌ సంచలనం రషీద్ ఖాన్.. జడేజాను బోల్తా

చివరి ఓవర్లో విజయానికి భారత్‌కు 7 పరుగులు కావాలి. క్రీజ్‌లో జడేజా ఉన్నాడు. నాలుగు బంతుల తర్వాత స్కోర్లు సమమయ్యాయి. మరో రెండు బంతుల్లో సింగిల్‌ తీయాల్సి ఉండగా అఫ్గాన్‌ సంచలనం రషీద్ ఖాన్.. జడేజాను బోల్తా కొట్టించాడు. జడేజా భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ ‘టై'గా ముగిసింది.

Story first published: Wednesday, September 26, 2018, 16:29 [IST]
Other articles published on Sep 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X