ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసియా కప్ మళ్లీ వచ్చేస్తోంది. ఈ టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ చూడొచ్చని ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఆసియా కప్లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్లు ఎవరో ఒకసారి చూస్తే..
సనత్ జయసూర్య: వన్డేల్లో ఓపెనర్లు ఎలా ఆడాలనే కొత్త సంప్రదాయం తీసుకొచ్చిన ప్లేయర్ సనత్ జయసూర్య అని చెప్పొచ్చు. ఆసియా కప్లో కూడా జయసూర్య డామినేషన్ కొనసాగింది. అతను ఈ టోర్నీలో 25 మ్యాచులు ఆడాడు. వీటిలో ఏకంగా ఆరు సెంచరీలతో చెలరేగాడు.

కుమార సంగక్కర: ఆసియా కప్లో అద్భుతంగా రాణించిన మరో లంక ప్లేయర్ కుమార సంగక్కర. ఆట నుంచి తప్పుకున్నా కూడా కానీ ఈ టోర్నీలో సంగక్కర రికార్డును కూడా ఎవరూ బ్రేక్ చేయలేకోయారు. అతను ఈ టోర్నీలో 21 మ్యాచులు ఆడి, నాలుగు సెంచరీలు చేశాడు.

విరాట్ కోహ్లీ: టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ కూడా ఆసియా కప్ అంటే చాలు రెచ్చిపోతాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో 11 మ్యాచులు ఆడిన కోహ్లీ.. మూడు సెంచరీలతో రాణించాడు. అంతేకాదు ఓవరాల్గా 61.30 సగటుతో 613 పరుగులు చేశాడు. అతని బెస్ట్ స్కోరు 183 పరుగులు కావడం గమనార్హం.

షోయబ్ మాలిక్: పాకిస్తాన్ వెటరన్ షోయబ్ మాలిక్ కూడా ఆసియా కప్లో అదరగొట్టిన వాడే. అతను ఈ టోర్నీలో 17 మ్యాచులు ఆడి 65.50 సగటుతో 786 పరుగులు చేశాడు. వీటిలో మూడు శతకాలు ఉండట అంటే మాటలు కాదు.
లాహిరు తిరుమానే: ఆసియా కప్లో ఆకట్టుకున్న మరో శ్రీలంక ప్లేయర్ లాహిరు తిరిమానే. తను ఇప్పటి వరకు ఆసియా కప్లో కేవలం 8 మ్యాచులే ఆడాడు. ఈ మ్యాచులు అన్నింటిలో కలిపి 363 పరుగులు చేశాడు. వీటిలో రెండు శతకాలు ఉండటం గమనార్హం.

శిఖర్ ధవన్: టీమిండియా తరఫున ఆసియా కప్లో రాణించిన మరో ప్లేయర్ శిఖర్ ధవన్. ఈ టోర్నీలో 9 మ్యాచులు ఆడిన ధవన్ 59.33 సగటుతో 534 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 127గా ఉంది. ఆసియా కప్లో ధవన్ రెండు శతకాలు నమోదు చేశాడు.

సురేష్ రైనా: ఆసియా కప్లో గుర్తుపెట్టుకోవాల్సిన మరో టీమిండియా వెటరన్ సురేష్ రైనా. ఆట నుంచి తప్పుకున్నా కూడా ఎవరూ ఇప్పటి వరకు రాలేదు. ఈ టోర్నీలో 13 మ్యాచులు ఆడిన రైనా రెండు శతకాలు బాదాడు. అంతేకాదు, ఏకంగా 60.77 సగటుతో 547 పరుగులు కూడా చేశాడు.