|
ఐసీసీ ట్విట్టర్లో ట్వీట్
2004లో జరిగిన ఆసియా కప్లో హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో యూనిస్ ఖాన్ ఈ పరుగులు నమోదు చేశాడు. తాజాగా, శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ముష్ఫికర్ రహీమ్ (144 పరుగులు) చేయడంతో ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మేరకు ఐసీసీ తన అధికారిక ట్విట్టర్లో ట్వీట్ చేసింది.
49.3 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌట్
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 49.3 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (2) రిటైర్డ్హర్ట్గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ లిట్టన్ దాస్ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన షకిబ్ ఉల్ హసన్ కూడా డకౌటయ్యాడు.
బంగ్లాదేశ్కి పోటీ ఇవ్వగల స్కోరు
అయినప్పటికీ బంగ్లా పోటీ ఇవ్వగల స్కోరు చేసిందంటే మాత్రం దానికి కారణం ముష్ఫికర్ రహీమ్. ఆరంభంలోనే ముగ్గురు బ్యాట్స్మెన్స్ను కోల్పోయిన బంగ్లాను ముష్ఫికర్ రహీమ్ (144; 150 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులు) ఒంటరి పోరు చేసి సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
మూడో వికెట్కు 134 పరుగుల భాగస్వామ్యం
మహ్మద్ మిథున్(63) కలిసి అమూల్యమైన మూడో వికెట్కు 134 పరుగుల భాగస్వామ్యం అందించాడు. అయితే ఇతర బ్యాట్స్మెన్ విఫలం కావడంతో 261 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 35.2 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్ 137 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.