న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దుబాయ్‌కు చేరిన టీమిండియా.. సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం

Asia Cup 2018: MS Dhoni Returns To Action As Team India Departs For Tournament

హైదరాబాద్: ఆసియా కప్‌ కోసం రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత జట్టు దుబాయ్‌ చేరుకుంది. టీమిండియాకు దుబాయ్ ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టులో భారత క్రికెటర్లు నూతన ఉత్సాహంతో కనిపించారు. మరి కొద్ది గంటల్లో అంటే సెప్టెంబర్ 15 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్‌ ప్రారంభం కానున్న టోర్నీ కోసం భారత క్రికెటర్లు సిద్ధం కానున్నారు.

<strong>'కోహ్లీ నేర్చుకోవాల్సింది ఇంకా చాలానే ఉంది' </strong>'కోహ్లీ నేర్చుకోవాల్సింది ఇంకా చాలానే ఉంది'

భారత్‌తో పాటు ఆసియాకు చెందిన జట్లు:

భారత్‌తో పాటు ఆసియాకు చెందిన జట్లు:

భారత్‌తో పాటు ఆసియాకు చెందిన శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, హాంకాంగ్‌, అఫ్గానిస్థాన్‌ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత్ మినహా అన్ని జట్లు ఇదివరకే దుబాయ్‌ చేరుకుని ప్రాక్టీసు మొదలుపెట్టేశాయి. ఆసియా కప్ 2018లో భాగంగా 18న హాంకాంగ్‌తో, 19తో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది.

భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం

ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ నాయకత్వంలోని మహేంద్ర సింగ్‌ ధోనీ, బుమ్రా, కుల్‌దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, చాహల్, మరికొందరు ఆటగాళ్లు గురువారం దుబాయ్‌ బయలుదేరారు. అక్కడికి చేరుకున్న భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ పద్ధతిలో నిర్వాహకులు ఆటగాళ్లకు స్వాగతం పలికారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. మరోవైపు రోహిత్ భార్య రితిక అక్కడే నిలుచుని రోహిత్ కోసం ఎదురుచూసింది.

కుల్దీప్ యాదవ్ మాత్రం ధోనీతో

దుబాయ్ చేరుకున్న తర్వాత ఆటగాళ్లతో సెల్ఫీలు తీసుకుని నెటిజన్లు తమ ఆనందాన్ని పంచుకుంటే ప్రయాణమైనప్పటి నుంచి టీమిండియా క్రికెటర్లు సెల్ఫీలతో తమ ప్రయాణాన్ని అధికారికంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే చాహల్.. కుల్దీప్ యాదవ్ తమ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా జట్టుతో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు. కుల్దీప్ యాదవ్ మాత్రం మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి ఫొటో దిగాడు.

మిగిలిన బృందమంతా ఆదివారానికి దుబాయ్:

మిగిలిన బృందమంతా ఆదివారానికి దుబాయ్:

ఇంగ్లాండ్ పర్యటన నుంచి వచ్చిన భారత ఆటగాళ్లు ఆదివారం దుబాయ్ వెళ్తారు. టెస్ట్ సిరీస్ ఆడిన కేఎల్‌ రాహుల్‌, బుమ్రా, దినేష్ కార్తీక్‌, శార్దూల్‌ ఠాకూర్‌, శిఖర్‌ ధావన్‌, పాండ్యాలు ఆదివారం దుబాయ్ చేరుకుంటారు. విరాట్‌ కోహ్లికి విశ్రాంతి నేపథ్యంలో రోహిత్‌ శర్మ జట్టును ఏ మేరకు లీడ్ చేస్తాడన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడనుంది.

Story first published: Friday, September 14, 2018, 12:06 [IST]
Other articles published on Sep 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X