
టీమిండియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది
టోర్నీలో నాయకత్వ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించిన రోహిత్ శర్మ ఏకంగా జట్టుని విజేతగా నిలిపాడు. దుబాయ్ వేదికగా శుక్రవారం అర్ధరాత్రి బంగ్లాదేశ్తో ముగిసిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. సుదీర్ఘకాలంగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కి కెప్టెన్సీ వహిస్తున్న రోహిత్ శర్మ.. ఆ జట్టుని ఇప్పటికే మూడు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు.

నిదహాస్ ట్రోఫీలోనూ కెప్టెన్గా
అంతేకాకుండా ఈ ఏడాది ముగిసిన నిదహాస్ ట్రోఫీలోనూ కోహ్లీ స్థానంలో భారత జట్టుకి కెప్టెన్సీ వహించి జట్టుకి టైటిల్ను అందించాడు. ఆసియా కప్లో భారత్ జట్టు గెలిచిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతుండగా.. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్సీకి మీరు సిద్ధమేనా..? అని ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు.

ఛాన్స్ దొరికితే తప్పకుండా కెప్టెన్సీ
‘హా.. సిద్ధమే. నా కెప్టెన్సీలో భారత్ జట్టు ఇప్పటి వరకు రెండు టైటిల్స్ మాత్రమే గెలిచింది. అయినప్పటికీ.. ఛాన్స్ దొరికితే తప్పకుండా కెప్టెన్సీ బాధ్యతలు అందుకుంటా' అని ధీమా వ్యక్తం చేశాడు.

2014 ఆఖర్లో ధోనీ నుంచి టెస్టు కెప్టెన్గా
2014 ఆఖర్లో ధోనీ నుంచి టెస్టు కెప్టెన్ బాధ్యతలు అందుకున్న విరాట్ కోహ్లీ.. 2016 ఆరంభంలో వన్డే, టీ20 కెప్టెన్గా ఎంపికై పూర్తిస్థాయి కెప్టెన్గా కొనసాగుతున్నాడు. టెస్టుల్లో కోహ్లీకి ప్రత్యామ్నాయంగా అజింక్య రహానె కనిపిస్తుండగా.. వన్డే, టీ20ల్లో ప్రత్యామ్నాయం కోసం ఈ ఏడాది ఆరంభం వరకూ టీమిండియా ఎదురుచూసింది.


Click it and Unblock the Notifications













