ఇస్లామాబాద్: ఆసియా కప్ 2016 టీ20లో భాగంగా బుధవారం పాకిస్థాన్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో తమ దేశ జట్టు గెలుస్తుందని ఓ పాకిస్థాన్ అభిమాని తన నెల జీతాన్ని పందెం(బెట్) కాసాడు. అయితే ఈ మ్యాచులో పాకిస్థాన్ ఓటమిపాలు కావడంతో మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పంజాబ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ క్లర్క్గా విధులు నిర్వహిస్తున్న ముహమ్మద్ షఫీక్ (50) తన కార్యాలయంలోనే ఫ్యానుకు ఉరివేసుకుని గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కథనాన్ని పాకిస్థాన్ పత్రిక డాన్ ప్రచురితం చేసింది.
పాకిస్థాన్ మ్యాచ్ ఓడిపోవడంతో షఫీక్ తన జీతం రూ. 30వేలను కోల్పోవాల్సి వచ్చిందని, దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని సోదరుడు ముహమ్మద్ రంజాన్ తెలిపాడు.