కోహ్లీ సేన అద్భుత విజయం
కరీబియన్ గడ్డపై భారత్ ఘనమైన బోణీ కొట్టింది. ఆతిథ్య వెస్టిండీస్తో నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
కోహ్లీ సేన అద్భుతం విజయం
దీంతో సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. దీంతో 63 ఏళ్లుగా వెస్టిండీస్లో పర్యటిస్తున్న భారత్కు తొలిసారి ఇన్నింగ్స్ విజయాన్ని సాధించినట్లయింది.
కోహ్లీ సేన అద్భుత విజయం
323 పరుగులు వెనుకబడి ఫాలోఆన్ ఆడిన విండీస్ను రెండో ఇన్నింగ్స్లో భారత్ 231 పరుగులకే ఆలౌట్ చేసింది. అశ్విన్ 7 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు.
టీమిండియా ఇన్నింగ్స్ విజయం
తొలి ఇన్నింగ్స్లో 243 పరుగులకే వెస్టిండీస్ను ఆలౌట్ చేసి, ఆ జట్టును ఫాలోఆన్లోకి నెట్టిన భారత బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్లో మరింతగా చెలరేగిపోయారు.
కోహ్లీ సేన విజయం
భారత ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.. బంతితోనూ విజృంభించాడు.
అశ్విన్ ధాటికి విండీస్ విలవిల
అశ్విన్ 25 ఓవర్లలో 87 పరుగులే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. అతడి ధాటికి విలవిలలాడిన విండీస్.. 78 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌటైంది.