అశ్విన్పై వేటు
సౌతాఫ్రికా పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై సెలెక్టర్లు వేటు వేశారు. కొంత కాలంగా భారత జట్టులో చోటు లేని చైనా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతనితోపాటు కొత్త కుర్రాడు లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తొలి సారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. మరో స్పిన్నర్ చాహల్ జట్టులో తన స్థానం నిలబెట్టుకున్నాడు. ఇక సౌతాఫ్రికా పర్యటనలో నిరాశపరించిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు వన్డే జట్టులో చోటు దక్కక పోయినప్పటికీ టీ20 జట్టులో దక్కింది.
టీ20లోకి అక్షర్ పటేల్
గాయం నుంచి కోలుకుంటున్న అక్షర్ పటేల్ వన్డే సిరీస్కు అందుబాటులో లేకపోయినప్పటికీ టీ20 సిరీస్కు అందుబాటులో ఉండనున్నాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ సిరీస్కు కూడా దూరంగా ఉండనున్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించని మరో ఆల్రౌండర్ హార్ధిక్పాండ్యాను కూడా సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. దేశవాళీ క్రికెట్లో ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిందిగా హార్ధిక్కు సెలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.
|
బుమ్రా, షమీకి విశ్రాంతి
ఇక సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీకి సెలెక్లర్లు విశ్రాంతి ఇచ్చారు. కరోనా కారణంగా సౌతాఫ్రికా పర్యటనకు దూరమైన వాషింగ్టన్ సుందర్కు వన్డే, టీ20 రెండింట్లోనూ చోటు దక్కింది. స్వదేశంలో న్యూజిలాండ్ టూర్కు ఎంపికైన బౌలర్లు అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్కు టీంలో చోటు లభించింది. యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ టీ20 జట్టులో చోటు నిలబెట్టుకున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్లో విఫలమైన వెంకటేశ్ అయ్యర్కు టీ20 జట్టులో చోటు దక్కింది. రుతురాజ్ గైక్వాడ్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.
|
మూడు కొత్త ముఖాలు
ఈ సిరీస్కు కొత్తగా ముగ్గురు ఎంపికయ్యారు. దీంతో వారు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టబోతున్నారు. దీపక్ హుడా, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్ తొలిసారి భారత జట్టుకు ఎంపియ్యారు. 18 మందిలో 13 మంది ఆటగాళ్లు వన్డే, టీ20 రెండు జట్లలోనూ చోటు దక్కించుకున్నారు. కాగా ఫిబ్రవరి 6, 9, 11వ తేదీల్లో అహ్మదాబాద్ వేదికగా 3 వన్డే సిరీస్ జరగనుంది. ఇక కోల్కతా వేదికగా ఫిబ్రవరి 16, 18, 20వ తేదీలలో టీ20 సిరీస్ జరగనుంది.
భారత్ జట్టు
వన్డే జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హూడా, రిషబ్ పంత్, చాహర్, శార్దూల్ ఠూకూర్, చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్లన్ సుందర్, రవి బిష్ణోయ్, సిరాజ్, ప్రసిధ్, అవేశ్ఖాన్.
టీ 20 జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, వెంకటేశ్అయ్యర్, చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, చాహల్, సుందర్, సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేశ్, హర్షల్