For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

5 Reasons: రిషబ్ పంత్ వరల్డ్‌కప్ జట్టులో ఉండాల్సిందే!

World Cup 2019: Ashish Nehra Lists 5 Reasons Why Rishabh Pant Should Be In India's World Cup Squad
Ashish Nehra lists 5 reasons why match-winner Rishabh Pant deserves to be in Indias World Cup squad

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఆడబోయే భారత జట్టులో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తప్పక ఉండాల్సిందేనంటూ మాజీ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరిస్ ముగిసే నాటికి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో ఆడే జట్టుపై పూర్తి స్పష్టత రానుందని ఇటీవలే ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు వరల్డ్‌కప్ తుది జట్టు ఎంపిక ప్రణాళికల్లో విజయ్ శంకర్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, ఖలీల్ అహ్మద్, రహానేలు ఉన్నారని చెప్పడంతో వారంతా ఈ సిరిస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

వరల్డ్‌కప్ జట్టులో రిషబ్ పంత్ ఉంటాడా?

వరల్డ్‌కప్ జట్టులో రిషబ్ పంత్ ఉంటాడా?

అయితే, వరల్డ్‌కప్ జట్టులో రిషబ్ పంత్ ఉంటాడా లేడా అన్నదానిపై స్పష్టత లేదు. దీంతో పంత్ మాత్రం జట్టులో ఉండాల్సిందేనని ఆశిష్ నెహ్రా అంటున్నాడు. ఇందుకు తన వద్ద ఐదు కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. గురువారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ "జట్టు విజయంలో చాలా మంది పాత్ర పోషిస్తుండవచ్చు. వరల్డ్‌కప్‌ లాంటి మెగా టోర్నీల్లో ఎక్స్ ఫ్యాక్టర్ ఉన్న ప్లేయర్స్ కావాలి. పంత్ కచ్చితంగా ఓ మ్యాచ్ విన్నర్. అతన్ని కచ్చితంగా వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలి" అని నెహ్రా అన్నాడు.

రిషబ్ పంత్ పనికొస్తాడు

రిషబ్ పంత్ పనికొస్తాడు

"ప్రస్తుతం భారత జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్‌ తప్ప తొలి ఏడు మంది బ్యాట్స్‌మెన్‌లో మరో ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ లేడు. జట్టులో ఎడమ, కుడి కాంబినేషన్ కచ్చితంగా ఉండాలి. ఇక్కడ రిషబ్ పంత్ పనికొస్తాడు. దీంతో పాటు రెండోది రిషబ్ పంత్ ఒకటో నంబర్ నుంచి ఏడో స్థానం వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు" అని నెహ్రా చెప్పాడు.

పంత్ సునాయాసంగా సిక్స్‌లు బాదగలడు

పంత్ సునాయాసంగా సిక్స్‌లు బాదగలడు

"పంత్ సునాయాసంగా సిక్స్‌లు బాదగలడు. రోహిత్ శర్మ తర్వాత జట్టులో పంత్‌కే ఆ సత్తా ఉంది. ఒత్తిడి సమయంలో ఏ మాత్రం భయపడకుండా ఆడగలడు. ప్రస్తుతం టీమ్‌కు అదే కావాలి. దీనికి తోడు ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించగలడు. ప్రస్తుతం జట్టులో కోహ్లీ, రోహిత్, బుమ్రా రూపంలో ముగ్గురు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు" అని ఆశిష్ నెహ్రా అన్నాడు. "రిషబ్ పంత్ నాలుగోవాడు. దినేశ్ కార్తీక్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్ కూడా మంచి ప్లేయర్స్. అయితే, వీరందరిలో లేని ఎక్స్ ఫ్యాక్టర్ పంత్‌లో ఉంది" అని ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు.

పంత్ కోసం దినేశ్ కార్తీక్‌ను పక్కన పెట్టాలా?

పంత్ కోసం దినేశ్ కార్తీక్‌ను పక్కన పెట్టాలా?

పంత్ కోసం దినేశ్ కార్తీక్‌ను పక్కన పెట్టాలా? అని ప్రశ్నకు గాను తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. "ఇద్దరినీ జట్టులోకి తీసుకోవచ్చు. పంత్‌ను మూడో ఓపెనర్‌గా తీసుకుంటే.. కార్తీక్ మిడిలార్డర్‌లో ఆడొచ్చు" అని నెహ్రా పేర్కొన్నాడు. ఇక, 15 మందిలో ముగ్గురు వికెట్ కీపర్లకు చోటివ్వడం సమంజసమేనా? అని ప్రశ్నిస్తే కార్తీక్, పంత్‌లను రెండు, మూడో వికెట్ కీపర్లుగా చూడటం తప్పని అన్నాడు. వీళ్లిద్దరూ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అని నెహ్రా చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, February 14, 2019, 18:41 [IST]
Other articles published on Feb 14, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+