
వరల్డ్కప్ జట్టులో రిషబ్ పంత్ ఉంటాడా?
అయితే, వరల్డ్కప్ జట్టులో రిషబ్ పంత్ ఉంటాడా లేడా అన్నదానిపై స్పష్టత లేదు. దీంతో పంత్ మాత్రం జట్టులో ఉండాల్సిందేనని ఆశిష్ నెహ్రా అంటున్నాడు. ఇందుకు తన వద్ద ఐదు కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. గురువారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ "జట్టు విజయంలో చాలా మంది పాత్ర పోషిస్తుండవచ్చు. వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీల్లో ఎక్స్ ఫ్యాక్టర్ ఉన్న ప్లేయర్స్ కావాలి. పంత్ కచ్చితంగా ఓ మ్యాచ్ విన్నర్. అతన్ని కచ్చితంగా వరల్డ్కప్కు ఎంపిక చేయాలి" అని నెహ్రా అన్నాడు.

రిషబ్ పంత్ పనికొస్తాడు
"ప్రస్తుతం భారత జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ తప్ప తొలి ఏడు మంది బ్యాట్స్మెన్లో మరో ఎడమచేతివాటం బ్యాట్స్మన్ లేడు. జట్టులో ఎడమ, కుడి కాంబినేషన్ కచ్చితంగా ఉండాలి. ఇక్కడ రిషబ్ పంత్ పనికొస్తాడు. దీంతో పాటు రెండోది రిషబ్ పంత్ ఒకటో నంబర్ నుంచి ఏడో స్థానం వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు" అని నెహ్రా చెప్పాడు.

పంత్ సునాయాసంగా సిక్స్లు బాదగలడు
"పంత్ సునాయాసంగా సిక్స్లు బాదగలడు. రోహిత్ శర్మ తర్వాత జట్టులో పంత్కే ఆ సత్తా ఉంది. ఒత్తిడి సమయంలో ఏ మాత్రం భయపడకుండా ఆడగలడు. ప్రస్తుతం టీమ్కు అదే కావాలి. దీనికి తోడు ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించగలడు. ప్రస్తుతం జట్టులో కోహ్లీ, రోహిత్, బుమ్రా రూపంలో ముగ్గురు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు" అని ఆశిష్ నెహ్రా అన్నాడు. "రిషబ్ పంత్ నాలుగోవాడు. దినేశ్ కార్తీక్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్ కూడా మంచి ప్లేయర్స్. అయితే, వీరందరిలో లేని ఎక్స్ ఫ్యాక్టర్ పంత్లో ఉంది" అని ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు.

పంత్ కోసం దినేశ్ కార్తీక్ను పక్కన పెట్టాలా?
పంత్ కోసం దినేశ్ కార్తీక్ను పక్కన పెట్టాలా? అని ప్రశ్నకు గాను తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. "ఇద్దరినీ జట్టులోకి తీసుకోవచ్చు. పంత్ను మూడో ఓపెనర్గా తీసుకుంటే.. కార్తీక్ మిడిలార్డర్లో ఆడొచ్చు" అని నెహ్రా పేర్కొన్నాడు. ఇక, 15 మందిలో ముగ్గురు వికెట్ కీపర్లకు చోటివ్వడం సమంజసమేనా? అని ప్రశ్నిస్తే కార్తీక్, పంత్లను రెండు, మూడో వికెట్ కీపర్లుగా చూడటం తప్పని అన్నాడు. వీళ్లిద్దరూ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అని నెహ్రా చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications













