హోటల్లో నెహ్రాకు వీడ్కోలు కార్యక్రమం
ఈ మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు బస చేసిన హోటల్లో నెహ్రాకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నెహ్రా కేక్ కట్ చేశాడు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, కెప్టెన్ కోహ్లీలు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
|
హిందీ కామెంటేటర్గా వీరేంద్ర సెహ్వాగ్
న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్లో వీరేంద్ర సెహ్వాగ్ హిందీ కామెంటేటర్గా వ్వవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శనివారం రాజ్ కోట్ వేదికగా సాయంత్రం 7 గంటలకు జరగనుంది.
చివరి మ్యాచ్లో వికెట్ తీయలేకపోయిన నెహ్రా
తన కెరీర్లో ఆడిన చివరి మ్యాచ్లో నెహ్రా వికెట్ తీయలేకపోయాడు. ఈ మ్యాచ్లో నెహ్రా 4 ఓవర్లు వేసి 29 పరుగులిచ్చాడు. మున్రో ఇచ్చిన సునాయసమైన క్యాచ్ను పాండ్యా విడిచిపెట్టడంతో నెహ్రాకు వికెట్ దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయాడు. అలాగే కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇచ్చిన మరో క్యాచ్ను కోహ్లీ జార విడిచాడు. ఈ మ్యాచ్లో చివరి ఓవర్ బౌలింగ్ వేసింది నెహ్రానే. చివరి ఓవర్లో అయినా నెహ్రాకు వికెట్ పడుతుందేమో అభిమానులు ఆశించారు. అయితే ఈ ఓవర్లో 7 పరుగులిచ్చిన నెహ్రా వికెట్ మాత్రం తీయలేకపోయాడు.
ఎన్నో సార్లు గాయాలు పాలైన నెహ్రా
నెహ్రా తన 18 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో ఎన్నో సార్లు గాయాలు పాలయ్యాడు. తన కెరీర్ మొత్తంలో 12 సార్లు సర్జరీలు చేయించుకున్నాడు. 1999లో శ్రీలంకతో టెస్ట్ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఆశిష్ నెహ్రా ఇప్పటివరకు 17 టెస్టులు, 120 వన్డేలు, 27 టీ20 మ్యాచ్లాడాడు. క్రికెట్ కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులు నెహ్రా ఎదుర్కొన్నాడు. జట్టులో అనేకమార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.
యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా
అయినా ఎన్నడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. సహచరులు ఒక్కొక్కరు నిష్క్రమిస్తున్నా.. ఏ మాత్రం నెరవకుండా జాతీయజట్టులో చోటు దక్కించుకుని యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. టెస్టులకు 2004లో, వన్డేలకు 2011 వరల్డ్ కప్ తర్వాత, 2014లో ఫస్ట్క్లాస్ క్రికెట్ నుంచి రిటైరైన నెహ్రా టీ20ల్లో మాత్రం కొనసాగాడు. భారత్ తరుపున 26 టీ20లు ఆడి 34వికెట్లు తీశాడు. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లాండ్తో జరిగిన టీ20లో 3/19 అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.