హైదరాబాద్: ఇంగ్లీషు గడ్డపై 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా జట్టు చరిత్ర సృష్టించబోతోంది. ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టుపై 185 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా యాషెస్ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రపంచ క్రికెట్లో కొత్త చరిత్రకు నాంది: తొలి వన్డేకి ఆతిథ్యమిస్తోన్న అమెరికా
ప్రస్తుతం ఇంగ్లండ్లో జరుగుతున్న యాషెస్ సిరీస్లో టిమ్ పైనీ నేతృత్వంలోని ఆసీస్ 2-1 ఆధిక్యంలో ఉంది. తొలి టెస్టును ఆసీస్ గెలవగా.. రెండో టెస్టు డ్రా ముగిసింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్.. నాలుగో టెస్టులో ఆసీస్లు విజయం సాధించాయి. ప్రస్తుతం ఆసీస్దే పైచేయిగా ఉంది.
నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించి యాషెస్ ట్రోఫీని నిలుపుకోవడంతో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మార్రిసన్ టిమ్ పైన్ సేనకు అభినందనలు తెలిపాడు. గురువారం నుంచి ఓవల్ వేదికగా జరగనున్న ఐదో టెస్టులో కూడా ఆస్ట్రేలియా విజయం సాధిస్తే ప్రధానికి నేరుగా ఫోన్ చేయవచ్చని టిమ్ పైన్ అన్నాడు.