బర్మింగ్హామ్: ప్రపంచకప్-2019 తర్వాత క్రికెట్ అభిమానులకు కనువిందు చేసేందుకు మరో ఆసక్తికర పోరు సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో ఎడ్జ్బాస్టన్ మైదానంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య యాషెస్ సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
సీనియర్ పేసర్ మిషెల్ స్టార్క్ను ఆసీస్ పక్కన పెట్టింది. అతని స్థానంలో జేమ్స్ ప్యాటిన్సన్ జట్టులోకి వచ్చాడు. మిషెల్ మార్ష్ కూడా తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఆసీస్ ఆరు మార్పులతో బరిలోకి దిగింది. ఇక ప్రపంచకప్లో మెరిసిన ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. కెప్టెన్ జో రూట్ మళ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.
Tim Paine wins the toss and Australia will bat first in the opening Ashes Test at Edgbaston!#Ashes pic.twitter.com/vClBcYk4Kw
— ICC (@ICC) August 1, 2019
2017-18 సీజన్లో ఆసీస్లో జరిగిన యాషెస్ను ఆస్ట్రేలియా 4-0తో సొంతం చేసుకుంది. అంతకుముందు 2015లో స్వదేశంలో జరిగిన సిరీస్ను 3-2తో గెలుచుకున్న ఇంగ్లండ్.. మళ్లీ దానిని సాధించాలని పట్టుదలగా ఉంది. బలమైన జట్టు, ప్రపంచకప్ గెలిచిన ఉత్సాహం, సొంతగడ్డపై సిరీస్ జరుగుతోన్న నేపథ్యంలో ఇంగ్లాండ్ ఫేవరేట్ జట్టుగా బరిలోకి దిగుతోంది. బాల్ టాంపరింగ్ వివాదం నుండి కోలుకోవడం, స్మిత్-వార్నర్ల పునరాగమనంతో ఆసీస్ కూడా సిరీస్పై ఆశలు పెట్టుకుంది. దీంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.
జట్లు:
ఇంగ్లండ్: రోరీ బర్న్స్, జేసన్ రాయ్, జో రూట్ (కెప్టెన్), జోయి డెన్లే, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, కామరూన్ బాన్క్రాఫ్ట్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మథ్యూ వేడ్, టీమ్ పైన్ (కెప్టెన్), పాట్ కమిన్స్, జేమ్స్ ప్యాటిన్సన్, నాథన్ లయన్, పీటర్ సిడిల్.