డబ్ల్యూపీఎల్ 2025లో సంచలన విజయం నమోదైంది. ఓటమి ఖాయమనుకున్న థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఆఖరి బంతికి రెండు పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ పై విజయాన్ని సాధించింది దిల్లీ క్యాపిటల్స్. ఈ విజయంలో తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి కీలక పాత్ర పోషించడం విశేషం.
మ్యాచ్ సాగిందిలా..
మొదట టాస్ ఓడి బ్యాటింగ్ క దిగిన ముంబయి జట్టు 19.1 ఓవర్లలో 164 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ముంబయి బ్యాటర్లలో నాట్ సీవర్ (59 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 80*) హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 42 పరుగులు) మంచి ఇన్నింగ్స్ ఆడింది. యాస్తికా భాటియా (11), అమేలియా కెర్ (9), అమన్జోత్ కౌర్ (7) నామమాత్రపు పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్ 3 వికెట్లు పడగొట్టగా.. శిఖా పాండే 2 వికెట్లు తీసింది. క్యాప్సే, మిన్ను మణి తలో వికెట్ దక్కించుకున్నారు.
