హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ విజయనగరంలో సందడి చేశాడు. స్థానిక విజ్జీ మైదానంలో గురువారం విదర్భతో ప్రారంభమైన అండర్-16 మ్యాచ్లో అతను ముంబై తరఫున బరిలోకి దిగాడు.
టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ చేయగా.. ఆట చివర్లో అర్జున్ బ్యాటింగ్కు వచ్చాడు. ఆట ముగిసే సమయానికి అతను 7 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.

అంతర్ రాష్ట్ర అండర్-16 క్రికెట్ మ్యాచుల్లో భాగంగా ముంబై, విదర్భ జట్ల మధ్య మ్యాచులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరంలో ప్రాక్టీస్ మ్యాచులు మూడురోజులపాటు జరగనున్నాయి.
తొలి రోజైన గురువారం టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టు 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు సాధించింది. కాగా, మ్యాచ్ ముగిసే సమయానికి అర్జున్ టెండూల్కర్ 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు.