
22 గంటలపాటు బ్యాటింగ్.. 3 సెంచరీలు
తొలి ఇన్నింగ్స్లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే వెయ్యికి పైగా బంతులు.. మొత్తంగా 22 గంటలపాటు బ్యాటింగ్.. మూడు సెంచరీలు ఇదీ చతేశ్వర్ పుజారా ఆసీ్సతో టెస్టు సిరీస్లో చూపుతున్న జోరు. అందుకే ఇంత ఓపికను ఎలా కనబరుస్తున్నాడో ఆతిథ్య జట్టు స్పిన్నర్ నాథన్ లియాన్కు కూడా విసుగుతెప్పించింది. అందుకే నేరుగా పూజారానే అడిగేశాడు. తొలి రోజు ఆటలో సెంచరీ తర్వాత నాన్స్ట్రయిక్ ఎండ్లో ఉన్న పుజారాను ‘నీకింకా బోర్ కొట్టడం లేదా' అంటూ సరదాగా ప్రశ్నించాడు. దీనికి పుజారా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు.

ఫుల్ షాట్స్, ముచ్చటైన్ కవర్ డ్రైవ్లతో
శుక్రవారం వ్యక్తిగత స్కోరు 130 వద్ద ఇన్నింగ్స్ని కొనసాగించిన చతేశ్వర్ పుజారా.. తొలి సెషన్ నుంచే దూకుడుగా ఆడాడు. పేసర్ల బౌలింగ్లో ఫుల్ షాట్స్, ముచ్చటైన్ కవర్ డ్రైవ్లతో ఆకట్టుకున్నాడు. వేగం పెంచాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి అజేయంగా నిలిచాడు.

డబుల్ సెంచరీ మిస్, 193కే
ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో భారత మిడిలార్డర్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లి.. కాస్తలో అవకాశాన్ని చేజార్చుకున్నాడు. రెండో రోజు తొలి రోజు దూకుడునే ఆసీస్ బౌలర్లపై కొనసాగించాడు. డబుల్ సెంచరీకి దగ్గరగా వచ్చిన పుజారాను నాథన్ లయన్ పెవిలియన్కు పంపాడు. ఇన్నింగ్స్ 130వ ఓవర్లో నాథన్ వేసిన చివరి బంతిని ఆడిన పుజారా (193) అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.


Click it and Unblock the Notifications













