హైదరాబాద్: కివీస్ పర్యటన మధ్యలో విరామం తీసుకున్న టీమిండియా కెప్టెన్ కోహ్లీ, తన భార్య అనుష్కశర్మతో కలిసి న్యూజిలాండ్లో ఆహ్లాదంగా గడుపుతున్నాడు. తాజాగా ఓ అందమైన లొకేషన్లో తన భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోని కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు.
ఆ ఫోటోలో ఇద్దరూ ఓ సరస్సు దగ్గర.. అందమైన వాతావరణంలో వీళ్లిద్దరూ కౌగిలించుకుని తన్మయత్వంలో ఉన్నారు. కోహ్లీ పోస్టు చేసిన ఫోటోకు కొన్ని గంటల్లోనే లక్షల లైక్లు వచ్చేశాయి. అమితానందానికి శ్వాస దూరంలో ఉన్నట్లు అనుష్క కూడా తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటో పోస్టు చేసింది.
View this post on InstagramYou're only always one breath away from Bliss ... ☺️💏💜
A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on