
హైదరాబాద్: రిసెప్షన్ వేడుకను హోటల్ తాజ్ ప్యాలస్లో ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా చేసిన ఏర్పాట్లకు ప్రధానితో సహా బంధు మిత్రులు సైతం ఆశ్చర్యానికి గురైయ్యారు. వేడుకలో కోహ్లీ, అనుష్కలు సంప్రదాయ దుస్తుల్లో హాజరైయ్యారు. వారి వేషాధారణే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
రెండ్రోజులు ముందు ఢిల్లీలోని తన స్వగృహానికి శ్రీమతిని తీసుకుని వచ్చిన విరాట్ రిసెప్షన్ ఏర్పాట్లు చూసుకున్నాడు. ఈ జంట ప్రధాని నరేంద్ర మోడీని స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇద్దరూ టాప్ సెలబ్రిటీలు, అందులో టీమిండియా కెప్టెన్ పిలిస్తే రాకుండా ఉంటారా.. వీలు చేసుకుని మరీ వేడుకకు పయనమయ్యారు.

నోట్లో కరెన్సీ నోటుతో అనుష్క:
పార్టీ తర్వాత పంజాబీ మ్యూజిక్తో హోటల్ హోరెత్తిపోయింది. ముఖ్యంగా నోట్లో ఓ కరెన్సీ నోటుతో అనుష్క చేసిన డ్యాన్స్ హైలైట్. విరాట్తోపాటు ధావన్తో కలిసి నుష్కీ స్టెప్పులేసింది. ఇప్పుడీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.