సారధ్య భాద్యతలు పోతాయనే:
ఇదే సమయంలో వన్డే, టీ20లకు కెప్టెన్గా రోహిత్ శర్మను.. టెస్ట్లకు కెప్టెన్గా విరాట్ కోహ్లీని నియమించాలనే అభిప్రాయాలు వచ్చాయి. రోహిత్ శర్మకి కెప్టెన్సీని అప్పగించడం ఇష్టం లేని కోహ్లీ మనసు మార్చుకుని.. తనకు విశ్రాంతి అవసరం లేదని, విండీస్ పర్యటనకు అందుబాటులో ఉంటానని తెలిపాడు. సారధ్య భాద్యతలు పోతాయనే అభద్రతా భావంతో కోహ్లీ విశ్రాంతి తీసుకోలేదని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు అన్నీ తప్పని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
అనుష్కను అన్ఫాలో:
ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కోహ్లీ, రోహిత్ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయనే అనిపిస్తోంది. ప్రపంచకప్లో న్యూజిలాండ్ చేతిలో సెమీస్ ఓటమి తర్వాత ఇద్దరి మధ్యా అభిప్రాయ భేదాలు తలెత్తాయని సమాచారం. గత సంవత్సరమే విరాట్ కోహ్లీని ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసిన రోహిత్ శర్మ.. తాజాగా బాలీవుడ్ హీరోయిన్, కోహ్లీ భార్య అనుష్క శర్మను కూడా అన్ఫాలో అయ్యాడు.
నిజం మాత్రమే కరచాలనం చేస్తుంది:
ఈ విషయంపై స్పందించిన అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు చేశారు. 'తప్పుడు వార్తల ప్రచారంలో నిజం మాత్రమే నిశబ్దంతో కరచాలనం చేస్తుంది' అనే కొటేషన్ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. అయితే రోహిత్, కోహ్లీల మధ్య ఏం జరిగిందనే విషయంపై మాత్రం ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. బీసీసీఐ కూడా స్పందించలేదు. అయితే సోషల్మీడియాలో మాత్రం ఈ ఇద్దరి వార్తలు వైరల్ అయ్యాయి.