
హైదరాబాద్: అవును. మీరు చదివింది నిజమే! టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి, కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేయసి అనుష్క శర్మ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులన్న విషయం మీకు తెలుసా? ఈ విషయాన్ని అనుష్కశర్మ ఫ్యాన్ క్లబ్ ఒకటి తాజాగా ట్విట్టర్లో బయటపెట్టింది.
వీరిద్దరి చిన్నప్పటి ఫొటోలు, తాజా ఫొటోలను కలిపి పోస్ట్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసలు వీరిద్దరికి చిన్నప్పటి నుంచే పరిచయం ఉందా? అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అనుష్క శర్మ తండ్రి ఆర్మీలో పనిచేస్తున్న సమయంలో అస్సాంలోని ఓ పాఠశాలలో ఆమె చదువుకుంది.
అదే సమయంలో అస్సాంలో ఉన్న సాక్షి కూడా అదే స్కూల్లో అనుష్కతో కలిసి చదువుకుంది. కాగా, అనుష్క శర్మ ప్రస్తుతం కెప్టెన్ కోహ్లీతో ప్రేమలో ఉంది. మరోవైపు సాక్షిని ధోని పెళ్లి చేసుకున్నాడు. వీరికి జీవా అనే మూడేళ్ల కూతురు ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.