
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో టీమిండియా కథ ముగిసింది. టోర్నీలో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో చివరి వరకు పోరాడి 18 పరుగులతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(77; 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ధోని(50; 72 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) చివరివరకు పోరాడినప్పటికీ టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయారు. 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది.
దీంతో టీమిండియా వరుసగా రెండోసారి సెమీస్లో టోర్నీ నుంచి నిష్క్రమించగా... న్యూజిలాండ్ వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్కు చేరింది. 2015లో జరిగిన ప్రపంచకప్లో కూడా న్యూజిలాండ్ పైనల్కు చేరిన సంగతి తెలిసిందే. అయితే, పైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలై రన్నరప్గా నిలిచింది.
ఈ మ్యాచ్లో టీమిండియా టాపార్డర్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్కు చేరారు. దీంతో వీరిపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలపై ఫన్నీ మీమ్స్తో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.