న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిద్రపోతున్న కోహ్లీ, పక్కనే దిగాలుగా అనుష్క: సెమీస్ ఓటమిపై ఫన్నీ మీమ్స్

ICC Cricket World Cup 2019,IND v NZ : Anushka Sharma's Sui Dhaaga Memes On India Lose WC Semifinal
 Anushka Sharmas Sui Dhaaga Memes Take Over Internet As Virat Kohli-led India Lose WC Semifinal

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా కథ ముగిసింది. టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి 18 పరుగులతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(77; 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ధోని(50; 72 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌) చివరివరకు పోరాడినప్పటికీ టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయారు. 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది.

దీంతో టీమిండియా వరుసగా రెండోసారి సెమీస్‌లో టోర్నీ నుంచి నిష్క్రమించగా... న్యూజిలాండ్‌ వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. 2015లో జరిగిన ప్రపంచకప్‌లో కూడా న్యూజిలాండ్ పైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. అయితే, పైనల్లో ఆసీస్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరారు. దీంతో వీరిపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలపై ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Story first published: Thursday, July 11, 2019, 12:09 [IST]
Other articles published on Jul 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X