
వరుస సిరీస్లు, ఐపీఎల్ టోర్నీతో బిజీ షెడ్యూల్ గడిపిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి సరదా సమయం గడిపాడు. తాజాగా ఐపీఎల్ సీజన్-12 నుండి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమించింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో బెంగళూరు ప్లేఆఫ్స్ అవకాశాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. బెంగళూరు తన తర్వాతి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచినా, ఓడినా బెంగళూరుకు ఉపయోగం ఉండదు.
దీంతో ఇప్పటి వరకూ బెంగళూరు జట్టును ప్లేఆఫ్స్కు చేర్చాలనే హడావిడిలో ఉన్న కోహ్లీకి కాస్త విశ్రాంతి దొరికింది. ఈ సమయాన్ని భార్య అనుష్క శర్మతో కలిసి గడుపుతున్నాడు. బుధవారం అనుష్క 31వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన భార్యతో కలిసి విరాట్ బయటకు వెళ్ళాడు. ఓ సరస్సు ఒడ్డున కూర్చుని అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ కబుర్లు చెప్పుకున్నారు. దీనికి సంబందించిన వీడియోను విరాట్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.