వోగ్ ఇండియా మ్యాగజైన్కు అనుష్క ఫోజులు
అయితే, బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్గా నిలిచిన పీకే, సుల్తాన్, సంజు లాంటి సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. వోగ్ ఇండియా మ్యాగజైన్కు ఆమె ఇచ్చిన తాజా ఫోజోలు యువతను తనవైపు తిప్పుకునేలా చేశాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను అనుష్క శర్మ తన ఇనిస్టాలో అభిమానులతో పంచుకుంది.
కోహ్లీతో కలిసి భూటాన్లో
కాగా, ప్రస్తుతం అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి భూటాన్లో పర్యటిస్తోంది. ఇద్దరు కూడా వారికి ఎక్కువగా ఇష్టపడేదానినే చేస్తున్నారు. అదేంటంటే జంతువులతో సరదాగా గడపడం, ఆ దేశ సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడం. భూటాన్ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ పర్యటనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు.
భూటాన్లోని ఓ సరస్సు వద్ద
ఆ ఫోటోల్లో భూటాన్లోని ఓ సరస్సు మరియు పర్వతాల సుందరమైన దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో అనుష్క మరియు విరాట్ కోహ్లీ ఒకరినినొకరు చేతులు పట్టుకొని కనిపించారు. ఈ ఫోటోని తన ఇనిస్టాగ్రామ్లో పోస్టు చేసిన విరాట్ కోహ్లీ "ప్రకృతి సౌందర్యానికి దగ్గరగా రావడానికి మీకు అవకాశం వచ్చినప్పుడు, ఆలోచనలు ఆగిపోతాయి. ఆ మీరు క్షణంతో ఒకటవుతారు. ఆ సమయంలోనే మీరు దైవిక శక్తితో కలిసిపోతారు. సో గ్రేట్పుల్" అంటూ కామెంట్ పెట్టాడు.


Click it and Unblock the Notifications












