ఏయ్ కోహ్లీ.. చౌకా మార్:
తాజాగా అనుష్క శర్మ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేసింది. క్రికెట్కు దూరమైన విరాట్ కోహ్లీకి దాన్ని గుర్తుచేస్తూ ఫోర్ కొట్టూ అంటూ ఒకటే అల్లరి చేసింది. 'కోలీ (కోహ్లీ).. ఏయ్ కోలీ.. చౌకా మార్.. చౌకా.. క్యా కర్రా' అంటూ సరదాగా ఏడిపించే యత్నం చేసింది అనుష్క. కాగా అనుష్క అల్లరికి కోహ్లీ బిత్తరచూపులు చూడటం తప్పితే చేసేదేమీ లేకపోయింది. అనుష్క మాటలకు ఒక్కసారిగా క్రికెట్ గుర్తుకు రావడంతో పేలగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు.
ఆ ఫీల్ కలిగించేలా చేశా:
దీనికి సంబంధించిన వీడియోలను అనుష్క శర్మ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగా.. అది వైరల్గా మారింది. 'మైదానంలో వినిపించే ఈ మాటలను కోహ్లీ మిస్సవుతున్నాడు. అతడిని ప్రేమించే లక్షలాది మంది అభిమానులతో పాటు.. ఇలా అరిచే ఫ్యాన్స్ను కోహ్లీ మిస్సవుతున్నాడు. అందుకే అతడికి ఆ ఫీల్ కలిగించేలా చేశా' అని అనుష్క శర్మ వీడియోకు క్యాప్షన్ జత చేసింది. అభిమానులు కూడా కోహ్లీని తమదైన స్టయిల్లో ఆటపట్టిస్తున్నారు.
ఇంతకాలం ఎప్పుడూ ఉండలేదు:
ఇటీవల ప్రస్తుతం అనుష్కతో ఎలా ఉంటున్నావ్ అని కెవిన్ పీటర్సన్ ప్రశ్నించగా... 'పెళ్లైనప్పటి నుంచి మేమిద్దరం ఒకేచోట ఇన్ని రోజులు కలిసి ఉండటం ఇదే తొలిసారి. ఒకేసారి ఇంతకాలం ఎప్పుడూ ఉండలేదు. కాక్రికెట్, సినిమాలతో ఇద్దరం బిజీగా ఉండేవాళ్లం. ఇప్పుడు కాస్త వింతగా ఉంది. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించాలనుకోవడం సరికాదు. కానీ.. అదే జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సానుకూల దృక్పథంతో ఉండాలి. ఇవి కఠిన రోజులు' అని కోహ్లీ బదులిచ్చాడు.
మరికొన్ని రోజులు ఆటకి దూరం:
భారత్లో కరోనా వైరస్ కట్టడి కోసం విరుష్క జోడీ రూ. 3 కోట్లు విరాళంగా ప్రకటించింది. అంతేకాకుండా.. గత నెల నుంచే వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తోంది. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ని తొలుత ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేసిన బీసీసీఐ.. తాజాగా నిరవధికంగా వాయిదా వేసేసింది. దీంతో మరికొన్ని రోజుల పాటు క్రికెటర్లు ఆటకి దూరంగా ఉండనున్నారు.