ఖాళీ సమయంలో టూర్లకు:
క్రికెట్ ఆటతో విరాట్ కోహ్లీ, సినిమాలతో అనుష్క శర్మ ఎంత బిజీగా ఉన్నా.. దొరికిన కాస్త సమయాన్ని ఇద్దరూ ఎంజాయ్ చేస్తారు. కోహ్లీకి పర్యటనల మధ్య దొరికే ఖాళీ సమయంలో ఇద్దరూ టూర్లకు వెళ్తుంటారు. వారి టూర్లకు సంబందించిన పోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. తరచూ ఏదో ఒక ఫొటోనో, వీడియోనో షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పటికీ టచ్లోనే ఉంటుంది విరుష్క జోడి.
భారత్కు అనుష్క:
ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ అనంతరం అనుష్క శర్మతో కలిసి విహారానికి వెళ్లిన సంగతి తెలిసిందే. పుటుటురులోని బ్రూస్ప్రింగ్స్ను సందర్శించారు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, జూనియర్ పేసర్ నవ్దీప్ సైనీలు విరుష్కలతో కలిసి అక్కడ ఎంజాయ్ చేశారు. తాజాగా అనుష్క తన భర్తను విడిచి భారత్కు పయనమైనట్లు సమాచారం తెలుస్తోంది. శుక్రవారం నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. దీంతో అనుష్క స్వదేశానికి తిరుగు పయనమయ్యారని సమాచారం.
అలా ఎప్పటికీ జరగదు:
అనుష్క భర్తను విడిచి భారత్కు వస్తున్న సందర్భంగా విరాట్ కోహ్లీని ఉద్దేశించి తన ఇన్స్టాగ్రామ్లో ఓ భావోద్వేగ పోస్టు పెట్టింది. 'వీడ్కోలు పలకడం సమయంతో పాటు తేలికవుతుందని భావిస్తుండొచ్చు. కానీ.. అది ఎప్పటికీ జరగదు' అని కోహ్లీతో దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను అభిమానులతో పంచుకుంది. మరోవైపు వాలెంటైన్స్ డే సందర్భంగా అనుష్కతో దిగిన ఫొటోను కోహ్లీ ట్విటర్లో అభిమానులతో పంచుకున్నాడు. కోహ్లీకి కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాల్సి రావడంతో అనుష్క ఇలా భావోద్వేగం చెందింది.
గోస్వామి బయోపిక్లో:
అనుష్క శర్మ ఇటీవల 'జీరో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షారూఖ్ ఖాన్, కత్రినా కైఫ్ లాంటి స్టార్లతో కలిసి ఆమె నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. తాజాగా అనుష్క ఇండియన్ ఉమెన్ సీనియర్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్గా తెరకెక్కబోతున్న 'చక్దాహా ఎక్స్ప్రెస్' అనే సినిమాలో నటించనుంది. ఈ పాత్ర కోసం అనుష్క క్రికెట్లో శిక్షణ తీసుకుంటోంది.