
లీడ్స్: భారత క్రికెట్ జట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనూష్క శర్మ అనుకోకుండా నెటిజన్లు, ట్విట్టరెట్టీల చేతికి చిక్కారు. ఆమె సరదాగా చేసిన ఓ కామెంట్.. నెటిజన్లకు చేతినిండా పనిపెట్టింది. ఆమెను తెగ ట్రోల్ చేసేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ప్రపంచకప్ టోర్నమెంట్ సందర్భంగా లీడ్స్లోని హెడింగ్లే కార్నేజ్ స్టేడియంలో ఆదివారం భారత్, శ్రీలంక మధ్య జరిగిన చిట్టచివరి లీగ్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూస్తోన్న అనూష్క శర్మ- తెలియక అడిగిందో లేక సరదాగా అడిగిందో తెలియట్లేదు గానీ..ఫోర్ కొట్టిన తరువాత అంపైర్ సిగ్నల్ ఎలా ఇస్తారు? అని తన పక్కనే కూర్చున్న వ్యక్తిని అడిగింది. ఇది కాస్తా- నెటిజన్ల కంట్లో పడింది. ఇంకేముంది? తెల్లారేసరికల్లా ఆమెపై మెమెలు తయారయ్యాయి. అవి వైరల్లా మారాయి. ఆమె వేసిన ప్రశ్నకు సంబంధించిన క్లిప్ను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి తమ కామెంట్లను జత చేశారు.