లీడ్స్: భారత క్రికెట్ జట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనూష్క శర్మ అనుకోకుండా నెటిజన్లు, ట్విట్టరెట్టీల చేతికి చిక్కారు. ఆమె సరదాగా చేసిన ఓ కామెంట్.. నెటిజన్లకు చేతినిండా పనిపెట్టింది. ఆమెను తెగ ట్రోల్ చేసేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ప్రపంచకప్ టోర్నమెంట్ సందర్భంగా లీడ్స్లోని హెడింగ్లే కార్నేజ్ స్టేడియంలో ఆదివారం భారత్, శ్రీలంక మధ్య జరిగిన చిట్టచివరి లీగ్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూస్తోన్న అనూష్క శర్మ- తెలియక అడిగిందో లేక సరదాగా అడిగిందో తెలియట్లేదు గానీ..ఫోర్ కొట్టిన తరువాత అంపైర్ సిగ్నల్ ఎలా ఇస్తారు? అని తన పక్కనే కూర్చున్న వ్యక్తిని అడిగింది. ఇది కాస్తా- నెటిజన్ల కంట్లో పడింది. ఇంకేముంది? తెల్లారేసరికల్లా ఆమెపై మెమెలు తయారయ్యాయి. అవి వైరల్లా మారాయి. ఆమె వేసిన ప్రశ్నకు సంబంధించిన క్లిప్ను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి తమ కామెంట్లను జత చేశారు.
Ye four ka signal kya hota hain😭😂 pic.twitter.com/aO5cDDdmSG
— Cricket Freak🙇🏼♂️ (@naveensurana06) July 6, 2019
Kohli be like......😅😅 pic.twitter.com/hBrLR389a3
— Sumeet Gahlawat (@GahlawatSumeet) July 6, 2019
Mtlb yeh flying kisses hee dekhne aati h
— Rannvijay singh (@Rannvijayyy) July 7, 2019
Wife of best cricketer in the world 😒😒😒
— ❤ SaRuu ❤ (@Khiladi_ki_Saru) July 7, 2019
Innocence. 😍
— Keshav Yadav 🇮🇳 (@keshav_yadav01) July 6, 2019
BIGGBOSS jaise record hota he sab
— Aditya (@Aditya13631203) July 6, 2019