కుంబ్లే, రికీల మధ్య సయోధ్య

పెర్త్: భారత, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల కెప్టెన్లు అనిల్ కుంబ్లే, రికీ పాంటింగ్ ల మధ్య సోమవారం సయోధ్య కుదిరింది. ఇరువురి మధ్య రెఫరీ రంజన్ మధుగళే సమక్షంలో చర్చలు జరిగాయి. ఇరువురి మధ్య దాదాపు అరగంట పాటు చర్చలు జరిగాయి. చర్చల పట్ల ఇరువురు కెప్టెన్లు సంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడా స్ఫూర్తి పరిరక్షణకు ఇద్దరం కలిసి పనిచేస్తామని అనిల్ కుంబ్లే చెప్పారు.
ఇరువురు కెప్టెన్లు కూడా తమ తమ బాధ్యతలు తెలుసుకున్నారని, సమస్య సమసిపోయిందని రంజన్ మధుగళే చెప్పారు. సిడ్నీ టెస్టులో చెలరేగిన వివాదంపై మధుగళే ఇరువురితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఆస్ట్రేలియా క్రీడాకారుడు బ్రాడ్ హాగ్ పై చేసిన ఆరోపణలను భారత్ ఉపసంహరించుకుంది. భారత స్పిన్నర్ హర్భజన్ పై కూడా చర్యలు ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.
Story first published: Monday, January 14, 2008, 16:10 [IST]
Other articles published on Jan 14, 2008
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications