హైదరాబాద్: "#ParikshaPeCharcha2020లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నన్ను ఉదాహరణగా చూపిస్తూ విద్యార్థుల్లో ప్రేరణ నింపడం ఎంతో గర్వంగా ఉంది. పరీక్షలు రాసే ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు" అని టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం 'పరీక్షాపే చర్చ' కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులతో ముచ్చటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనిల్ కుంబ్లే పేరుని ప్రస్తావించిన ప్రధాని 2002లో వెస్టిండిస్తో జరిగిన ఆంటిగ్వా టెస్ట్లో గాయపడి కుంబ్లే బౌలింగ్ చేయడాన్ని గుర్తు చేశారు.
India tour of New Zealand 2020: పేలవ రికార్డు, బుమ్రా తొలిసారి, ఆసక్తికర విషయాలివే!
దీనిపై కుంబ్లే ట్విట్టర్లో "#ParikshaPeCharcha2020లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నన్ను ఉదాహరణగా చూపిస్తూ విద్యార్థుల్లో ప్రేరణ నింపడం ఎంతో గర్వంగా ఉంది. పరీక్షలు రాసే ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు" అని ట్వీట్ చేస్తూ ఇందుకు సంబంధించి మోడీ మాట్లాడిన వీడియోను కూడా పోస్టు చేశాడు.
Honoured to have been mentioned in #ParikshaPeCharcha2020 Thankyou Hon. PM @narendramodi ji. Best wishes to everyone writing their exams. pic.twitter.com/BwsMXDgemD
— Anil Kumble (@anilkumble1074) January 22, 2020
ఆంటిగ్వా వేదికగా 2002లో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో కుంబ్లే దవడ ఎముకకు గాయమైంది. సర్జరీ చేయాల్సిన పరిస్థితి రావడంతో ఆయనను జట్టు నుంచి తప్పించాలని అనుకున్నప్పటికీ... అందరినీ ఆశ్చర్యపరుస్తూ కుంబ్లే తన దవడకు బ్యాండేజ్ వేసుకుని మరీ మ్యాచ్ని కొనసాగించాడు. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది.
రోహిత్కు న్యూజిలాండ్ మాజీ కోచ్ సలహా.. ఏంటో తెలుసా?
ఇదే కార్యక్రమంలో 2001లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టుని ప్రస్తావించారు. "మన జట్టు కష్టాల్లో పడింది. ఆటగాళ్ల మూడ్కూడా బాగాలేదు. ఆ స్థితిలో లక్ష్మణ్, ద్రావిడ్ ఆడిన ఇన్నింగ్స్ను మరిచి పోగలమా. వారు మ్యాచ్ను మనవైపు తిప్పారు" అని ప్రధాని మోడీ ఆ టెస్టుని కూడా గుర్తు చేశారు.
స్టీవ్ వా నేతృత్వంలోని ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేసిన ఆలౌటైంది. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్లో 171 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియా ఫాలో ఆన్ అడింది. రెండో ఇన్నింగ్స్లో లక్ష్మన్ 281 పరుగులు చేయగా, ద్రవిడ్ 180 పరుగులు చేశారు.
మంచి ఆరంభం... U-19 ట్రోఫీని తిరిగి భారత్కు తీసుకురండి: రోహిత్ శర్మ
వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్లు కలిసి 376 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి 657 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసీస్పై భారత స్పిన్నర్లు విజృంభించడంతో భారత్ 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టెస్టు భారత క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోతుంది.