
గౌరవంగా భావిస్తున్నాను
'ప్రధాన కోచ్గా కొనసాగమని నాపై బీసీసీఐ సలహా కమిటీ విశ్వాసం ఉంచడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఏడాదిగా టీమిండియా సాధించిన విజయాల ఘనత కెప్టెన్కు, జట్టంతటికీ, కోచింగ్ బృందానికి దక్కుతుంది. వెస్టిండీస్ పర్యటనకు కోచ్గా కొనసాగమని క్రికెట్ సలహా కమిటీ నన్ను కోరింది' అని కుంబ్లే అన్నాడు.

నా కోచింగ్ శైలిపై కెప్టెన్కు అభ్యంతరాలు
'అయితే నేను ప్రధాన కోచ్గా కొనసాగడంపై, నా కోచింగ్ శైలిపై కెప్టెన్కు అభ్యంతరాలున్నట్లు బీసీసీఐ తొలిసారి సోమవారం తెలిపింది. ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. కోచ్గా నా పరిధిని ఎప్పుడూ దాటలేదు. మా ఇద్దరి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు బీసీసీఐ ప్రయత్నించింది' అని అన్నాడు.

ఈ బంధం కొనసాగడం సమర్థనీయం కాదు
'అయితే ఈ బంధం కొనసాగడం సమర్థనీయం కాదన్నది స్పష్టం. అందుకే నేను వైదొలగడం సరైందని నమ్ముతున్నాను. వృత్తితత్వం, క్రమశిక్షణ, అంకితభావం, నిజాయతీ, భిన్న ఆలోచనలు.. ఇలా విశిష్ట లక్షణాలను నేను జట్టులోకి తీసుకొచ్చాను. ఓ బంధం ప్రభావవంతంగా ఉండాలంటే వీటికి విలువ ఇవ్వడం చాలా ముఖ్యం' అని కుంబ్లే తెలిపాడు.
అభ్యంతరాల నేపథ్యంలో వైదొలగాలని నిర్ణయించుకున్నా
'నా కొనసాగింపుపై అభ్యంతరాల నేపథ్యంలో వైదొలగాలని నిర్ణయించుకున్నా. ఏడాదిగా టీమిండియా ప్రధాన కోచ్గా సేవలు అందించే అవకాశం దక్కడం నాకు లభించిన గౌరవం. భారత క్రికెట్కు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచే అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎప్పటికీ భారత క్రికెట్ శ్రేయోభిలాషిగా ఉంటాను' ధన్యవాదాలు అంటూ కుంబ్లే పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











