ట్వీట్ చేసిన రీట్వీట్ చేసిన అనుష్క శర్మ
కోహ్లీ ట్వీట్ చేసిన ట్వీట్లను అనుష్క శర్మ రీట్వీట్ చేసింది. తాము జనవరి 1న నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలు రూమర్లేనంటూ పేర్కొంది. వివరాల్లోకి వెళితే న్యూయర్ ఇయర్ రోజున కోహ్లీ-అనుష్క శర్మ ఎంగేజ్మెంట్కి సిద్ధమవుతున్నట్లు గురువారం జాతీయ మీడియాలో వార్తలు వెలుగుచూశాయి.
న్యూస్ ఛానెల్స్ ప్రసారాలన్నీ రూమర్సే
దేశంలోని ప్రముఖ న్యూస్ ఛానెల్స్ కూడా ఈ న్యూస్ని ప్రసారం చేయడం గమనార్హం. ఇంగ్లాండ్తో టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత కోహ్లీ తన ప్రేయసి అనుష్క శర్మతో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ఉత్తరాఖండ్ విహారయాత్రలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే.
ఆనందా హోటల్లో వీరిద్దరి నిశ్చితార్థం
ఈ క్రమంలో ఉత్తరాఖండ్లోని నరేంద్రనగర్ ఆనందా హోటల్లో ఈ ఇద్దరి నిశ్చితార్థం జరగనున్నట్టు కథనాలు వెలువడ్డాయి. కోహ్లీ-అనుష్క ఎంగేజ్మెంట్కు ప్రముఖులు హాజరవుతారని చెప్పుకున్నారు. అనుష్క స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇప్పటికే అక్కడికి చేరుకొని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని వార్తలు వచ్చాయి. అక్కడి నుంచే వీరిద్దరూ తమ తమ ఇనిస్టాగ్రామ్లలో పోస్టు చేస్తున్నారు.
స్పందించిన విరాట్ కోహ్లీ
దీంతో ఈ వార్తలపై చివరికి విరాట్ కోహ్లీ స్పందించాల్సి వచ్చింది. అనుష్కశర్మతో ఎంగేజ్ మెంట్ వార్తలు అవాస్తవం అని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో విహరిస్తుండగా ఒక అభిమానికి వీరిద్దరూ దొరికిపోయారు. ఈ సందర్భంగా ఓ గుడి పూజారి వద్ద ఈ ఇద్దరు ఆశీస్సులు తీసుకుంటుండగా అభిమాని ఒకరు ఫొటో తీసి.. సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
క్రిస్టమస్ ట్విట్టర్ లో కోహ్లీ శుభాకాంక్షలు
ఇక క్రిస్టమస్ శుభాకాంక్షలు చెబుతూ మెడలో రుద్రాక్షమాల వేసుకుని ఓ సెల్ఫీ దిగి అభిమానుల కోసం ట్విట్టర్లో పోస్టు చేశాడు.


Click it and Unblock the Notifications











