
షమీ విసిరిన యార్కర్కి రస్సెల్ క్లీన్ బౌల్డ్
మహ్మద్ షమీ విసిరిన యార్కర్కి రస్సెల్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే అంపైర్ దానిని నోబాల్గా ప్రకటించాడు. టీ20ల్లో తొలి ఆరు ఓవర్లు (పవర్ ప్లే) ముగిసిన తర్వాత 20 ఓవర్ల వరకూ 30 యార్డ్ సర్కిల్లో కనీసం నలుగురు ఫీల్డర్లు ఉండాలి. కానీ, ఆండ్రీ రస్సెల్ బౌల్డయిన బంతిని షమీ విసిరిన సమయంలో 30 యార్డ్ సర్కిల్లో కేవలం ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉండటాన్ని అశ్విన్ గమనించలేదు.

నోబాల్గా ప్రకటించిన ఫీల్డ్ అంఫైర్
దీంతో థర్డ్ అంపైర్తో సమీక్షించిన ఫీల్డ్ అంపైర్ ఆ బంతిని నోబాల్గా ప్రకటించాడు. ఆ తర్వాత రస్సెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎంతలా అంటే.. మహ్మద్ షమీ వేసిన తర్వాత ఓవర్లో వరుసగా 6, 6, 6, 4 బాదిన రసెల్.. ఆండ్రూ టై బౌలింగ్లోనూ 6, 4, 4, 6 సాధించాడు.
17 బంతుల్లో 48 పరుగులు
కేవలం 17 బంతుల్లో 48 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దీంతో కోల్కతా చివరి 19 బంతుల్లో ఏకంగా 56 పరుగులు రాబట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ మ్యాచ్లో కోల్కతా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.
కోల్కతాకు ఇది వరుసగా రెండో విజయం
సొంతగడ్డపై కోల్కతాకు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. మరోవైపు రాజస్థాన్తో మ్యాచ్లో మాన్కడింగ్ రనౌట్పై స్పందిస్తూ రూల్స్ మాట్లాడిన అశ్విన్.. తాజా తప్పిదంతో అతనికి క్రికెట్ బేసిక్స్ కూడా తెలియవంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications













