
16 వన్డేలు.. 218 పరుగులు:
2005 జులై 30న శ్రీలంకతో తొలి వన్డే ఆడిన వేణు.. 2006 మే 23న వెస్టిండీస్తో కెరీర్లో ఆఖరి వన్డే ఆడాడు. కేవలం పది నెలల కాలం మాత్రమే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. టీమిండియా తరపున 16 వన్డేల్లో 218 పరుగులు చేశాడు. అందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. ఏకైక అర్ధ సెంచరీ పాకిస్తాన్పై సాధించాడు. అత్యధిక స్కోర్ 61 నాటౌట్.

65 ఐపీఎల్ మ్యాచ్లు:
121 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 7081 పరుగులు సాధించాడు. అందులో 17 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వేణుగోపాల రావు 2008-2014 మధ్య కాలంలో ఐపీఎల్లో మొత్తం 65 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్, దిల్లీ డేర్డెవిల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున వేణు బరిలోకి దిగాడు. టీ20లలో మాత్రం వేణు ఆకట్టుకోలేకపోయాడు. మొదటి సీజన్లో పర్వాలేదనిపించిన వేణు.. ఆ తర్వాత పరుగులు చేయడంలో ఇబ్బందిపడ్డాడు.

జనసేన పార్టీలోకి:
దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చిన వేణు.. అంతర్జాతీయ కెరీర్ మాత్రం ఆశాజనకంగా సాగలేదు. అయితే విజయ్ హజారే ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, చాలెంజర్ ట్రోఫీలో తనదైన ముద్ర వేసాడు. 2017 అక్టోబరులో ఆంధ్ర, తమిళనాడు మధ్య జరిగిన రంజీ మ్యాచ్ ఆడిన తర్వాత రెండేళ్లుగా వేణుగోపాల రావు మళ్లీ మైదానంలోకి దిగలేదు. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్గా కొనసాగుతున్నాడు. వేణు 2019 ఎన్నికలకు ముందు హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరాడు.


Click it and Unblock the Notifications












