హైదరాబాద్: అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ టెస్టులో కోహ్లీ పేరు ముద్రించిన నీలి రంగు జెర్సీ ధరించి ఏడేళ్ల బుడతడొకడు సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఒక క్రికెటర్గా ఈ అనుభవాన్ని నేను కోరుకోను: స్మిత్, వార్నర్పై కోహ్లీ
ఇంతకీ ఆ బుడతడు ఎవరని అనుకుంటున్నారా? ఆ చిన్నారి ఫ్యాన్ పేరు సాగె. తల్లి ఆర్తీ గోయల్ భారత సంతతికి చెందిన మహిళ. తండ్రి కరీమ్ ట్యునీసియా, పోలెండ్, ఉక్రెయిన్ మూలాలున్న వ్యక్తి. ఆర్తీ సైకియాట్రిస్ట్ అయితే కరీమ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు.
వీరికి క్రికెట్ అంటే ప్రాణం. అడిలైడ్ ఓవల్ మైదానంలో జరిగే ప్రతి మ్యాచ్ని తప్పక వీక్షిస్తారు. అలా నాలుగేళ్ల ప్రాయంనుంచే స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్లు చూడడం ప్రారంభించాడు సాగె. ప్రస్తుతం క్రికెట్లో క్రికెట్ ఓనమాలు నేర్చుకుంటున్నాడు. ఇందులో భాగంగా క్లబ్ క్రికెట్ ఆడనున్నాడు.
బౌలింగ్ అంటే సాగెకు ఎంతో ఇష్టం. భవిష్యత్లో అవకాశం లభిస్తే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బౌల్డ్ చేస్తానని అన్నాడు. అయితే, ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కలవాలని అనుకుంటున్నాడట.
గత ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సెంచరీలు, అందులో అడిలైడ్లో చేసింది తన కుమారుడికి గుర్తుందని కరీమ్ చెప్పుకొచ్చాడు. కాగా, అడిలైడ్ టెస్టులో విజయం సాధించడంతో నాలుగు టెస్ట్ల సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య పెర్త్ వేదికగా రెండో టెస్టు డిసెంబర్ 14న ప్రారంభం కానుంది.