ఐపీఎల్లోకి అభిషేక్
చెన్నై సూపర్ కింగ్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలతో చర్చలు జరిపినట్లు.. సీఎస్కేను తీసుకునేందుకు యత్నించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఐపీఎల్లోకి అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ప్రవేశించనున్నారనే వార్త అటు బిగ్ బీ, ఇటు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
క్లారిటీ ఇచ్చిన బిగ్ బి
తాజాగా గురువారం అమితాబ్ ఈ వార్తలను కొట్టిపారేశారు. "నేను గాని నా కుటుంబ సభ్యులు ఐపీఎల్లో ఏ జట్టును కొనుగోలు చేయలేదు.. అలాంటి ప్రయత్నాలు కూడా చేయటం లేదు. నేను, నా కొడుకు అభిషేక్ ఐపీఎల్లో సీఎస్కేను కొనుగోలుచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం" అని అమితాబ్ పేర్కొన్నారు.
మార్చి 30న ఐపీఎల్ 2019 సీజన్
ఇప్పటికే అభిషేక్ బచ్చన్ ఇండియన్ సూపర్ లీగ్లో చెన్నయిన్ ఎఫ్సీ, ప్రొ కబడ్డీ లీగ్లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్లలో వాటాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్ని ముందుకు జరిపారు. మార్చి 30న ప్రారంభం కానున్న ఐపీఎల్ ఏప్రిల్ రెండో వారంలో ముగియనుంది.