వరల్డ్కప్ కోసం ప్రత్యేకంగా నెట్ బౌలర్లు
ఇదిలా ఉంటే, వరల్డ్కప్ కోసం ప్రత్యేకంగా ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, దీపక్ చాహర్లను నెట్ బౌలర్లుగా బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే, వీరి కేవలం నెట్ బౌలర్లుగానే వ్యవహారిస్తారని అధికారికంగా స్టాండ్బై ఆటగాళ్లు కారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
బౌలర్లు ఎవరైనా గాయపడితే
"ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, దీపక్ చాహర్ అధికారికంగా స్టాండ్బై ఆటగాళ్లు కారు. బౌలర్లు ఎవరైనా గాయపడితే వీరిలో ఎవరితోనైనా భర్తీ చేసే అవకాశం ఉంది. పూర్తిగా బ్యాట్స్మన్ అయితే అంబటి రాయుడు లేదా రిషబ్ పంత్కు అవకాశం దక్కుతుంది" అని ఆయన అన్నారు.
సోమవారం జట్టుని ప్రకటించిన బీసీసీఐ
ప్రస్తుతం క్రికెటర్లు విరామం లేకుండా ఐపీఎల్ ఆడుతుండటంతో వరల్డ్కప్కు ముందు యో-యో పరీక్ష ఉండదని ఆయన తెలిపారు. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
రాయుడు, పంత్లకు సెలక్టర్లు మొండిచేయి
విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జశ్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీలు ఉన్నారు. కాగా, అంబటి రాయుడు, రిషబ్ పంత్లకు సెలక్టర్లు మొండిచేయి చూపించారు.
మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు
అంబటి రాయుడు, రిషబ్ పంత్లను వరల్డ్కప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంతో పలువురు మాజీ క్రికెటర్లు సెలక్టర్లపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్కు సునీల్ గవాస్కర్ అండగా నిలవగా... అంబటి రాయుడికి గౌతమ్ గంభీర్ అండగా నిలిచాడు. దీంతో వీరిద్దరిని బీసీసీఐ స్టాండ్బైగా ఎంపిక చేసింది