Ambati Rayudu: భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గురువారం సోషల్ మీడియాలో ట్రోల్కు గురయ్యాడు. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో అంబటి రాయుడు ఆపరేషన్ సిందూర్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు అనిపించేలా ఒక పోస్ట్ చేశాడు. "కంటికి కన్ను మొత్తం ప్రపంచాన్ని అంధుడిని చేస్తుంది" అంటూ అంబటి రాయుడు పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో రాయుడు చాలా విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అంబటి రాయుడు ఇప్పుడు ఆ ట్వీట్ను తొలగించాడు.
వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తన ట్వీట్పై వివరణ ఇచ్చాడు. జనాలు తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు పరిస్థితులపై తప్పుగా అర్థం చేసుకున్న వ్యాఖ్యల గురించి మరోసారి స్పష్టంగా చెప్పాడు. నాకు అలాంటి ఉద్దేశం లేదు.. నేను దానిని స్పష్టం చేయాలనుకుంటున్నానని వివరించాడు. ఈ సమయంలో ఆపరేషన్ సిందూర్ ద్వారా కఠినమైన చర్యలు తీసుకుంటున్న భారత ప్రభుత్వంతో తాను నిలబడతానని.. భారత సైన్యంతో దృఢంగా నిలిబడతానని అంబటి రాయుడు స్పష్టం చేశాడు. తోటి పౌరుల మనోభావాలను హృదయపూర్వకంగా గౌరవిస్తానన్నారు.

సరిహద్దు పరిస్థితికి సంబంధించి తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలను స్పష్టం చేయాలనుకుంటున్నానని.. అది తప్పుగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోందన్నాడు. అది తన ఉద్దేశం కాదని.. రికార్డును సరిదిద్దాలనుకుంటున్నానని అంబటి రాయుడు వివరించాడు.
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పాకిస్థాన్ సైన్యం పశ్చిమ సరిహద్దుపై దాడులు ప్రారంభించింది. భారత సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నారు. భారీ ఆయుధాలతో కాల్పులు జరిపారు. శ్రీనగర్ సహా అనేక చోట్ల వైమానిక చొరబాటుకు ప్రయత్నాలు జరిగాయి. భారత్ నుంచి తగిన సమాధానం లభిస్తోంది. భారత వైమానిక రక్షణ వ్యవస్థలు క్షిపణులను, డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేశాయి. అదే సమయంలో భారత్ వైమానిక ప్రయోగాలు మందుగుండు సామగ్రి, యుద్ధ విమానాల ద్వారా రఫీకి, మురిద్, చక్లాలా, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియన్లలో ఉన్న పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.