
రాయుడు యావరేజి 103.33
టీమిండియా విజయవంతంగా ఛేజ్ మ్యాచ్ల్లో ధోనీ యావరేజి 103.07 ఉండగా.. అంబటి రాయుడు యావరేజి 103.33గా ఉంది. దశాంశాల తేడాతో రాయుడు ధోనీని దాటేశాడన్నమాట. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ యావరేజి 96.94గా ఉంది. రస్సెల్ ఆర్నాల్ (91.00), మైకెల్ బేవాన్ (86.25) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మిడిలార్డర్లో సరైన బ్యాట్స్మన్ కోసం
జట్టులో మిడిలార్డర్లో సరైన బ్యాట్స్మన్ కోసం చూస్తోన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటగాళ్లను రొటేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మంచి ఫామ్లో ఉన్న అంబటి రాయుడు వరల్డ్ కప్ బెర్త్ కోసం దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్లతో పోటీ పడుతున్నాడు. కాగా, నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

న్యూజిలాండ్ నిర్దేశించిన 156 పరుగులు లక్ష్యాన్ని
న్యూజిలాండ్ నిర్దేశించిన 156 పరుగులు లక్ష్యాన్ని 34.5 ఓవర్లలోనే ఛేదించింది. భారత బ్యాట్స్మెన్లలో శిఖర్ ధావన్ (75 నాటౌట్: 103 బంతుల్లో 6 ఫోర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లి (45: 59 బంతుల్లో 3 ఫోర్లు), అంబటి రాయుడు (13 నాటౌట్)లు రాణించారు. ఈ సిరిస్లో రెండో వన్డే జనవరి 26న జరగనుంది.


Click it and Unblock the Notifications
