మొహాలీ: వంద కోట్ల మంది భారతీయులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారత్ - పాక్ సెమీ ఫైనల్ మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభం కానుంది. పాక్ తో భారత్ గెలవాలని ఆశిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సామాన్యులతో పాటు కార్పొరేట్ దిగ్గజాలు కూడా భారత్ గెలుపు కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ కంపెనీలు బుధవారం సెలవును ప్రకటిస్తే, మరికొన్ని సగం పూటకే కార్యాలయ పనులను పరిమితం చేస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత కార్యాలయాలలోని పెద్ద స్ర్కీన్ లు ఏర్పాటు చేసి ఉద్యోగులు అక్కడే ఆటను చూసే వెసులుబాటును కల్పిస్తున్నాయి.సామాన్యులతో పాటు కార్పొరేట్ దిగ్గజాలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు సన్నద్దమయ్యారు. ముఖేష్ అంబానీ ఆయన సతీమణి రీటా అంబానీతో, అనీల్ అంబానీ, కింగ్ పిషర్ అధినేత విజయ్ మాల్యా తదితరులు ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించనున్నారు. వీరి దారిలో మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించే కార్పొరేట్ దిగ్గజాలలో పవన్ ముంజాల్, మాల్విందర్ సింగ్, శివీందర్ సింగ్, శైలేష్ చతుర్వేది, నెస్ వాడియా తదితరులు ఉన్నారు. అంతేకాదు ఒబెరాయ్ హోటల్లో సిఐఐ పలు కంపెనీల సిఈవోలకు మ్యాచ్ సందర్భంగా ఆతిథ్యం ఇవ్వనుంది. ఒబెరాయ్ హోటల్లో పెద్ద స్ర్కీన్ ఏర్పాటు చేసి వారు మ్యాచ్ చూడనున్నారు. ఇందులో రాకేష్ భారతీ మిట్టల్, బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్, ఆదేశ్ గుప్తా, అలోక్ సక్సేనా, మణీందర్ ఎస్.గ్రేవల్ తదితరులు ఉన్నారు.ఫిక్కీ కూడా సార్క్ దేశాలకు చెందిన దౌత్య వేత్తలకు మ్యాచ్ సందర్భంగా విందు ఇవ్వనుంది. కొన్ని కంపెనీలు ఈ రోజు సెలవు ప్రకటించాయి. మరికొన్ని సగం పూట సెలవును ప్రకటించాయి. కార్యాలయాలలోనే మ్యాచ్ చూసే వారికి స్ర్కీన్ లు ఏర్పాటు చేస్తున్నారు. కుటుంబ సమేతంగా మ్యాచ్ చూసే అవకాశాన్ని కూడా కంపెనీలు ఉద్యోగులకు కల్పిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు భారత్ క్రీడాకారుల డ్రెస్ కోడ్ వంటి టీషర్టులను, జెర్సీలను అందించాయి. #13;