ఆస్ట్రేలియా నుంచే ఎక్కువ మంది..
కోచి వేదికగా జరిగే ఐపీఎల్ మినీ వేలంలో మొత్తం 991 మంది ఆటగాళ్లు తమ పేర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 714 మంది భారతీయులే ఉండటం గమనార్హం. వీరిలో 19 మంది భారత జట్టుకు ఆడిన వాళ్లు కాగా.. మిగతా వాళ్లంతా దేశవాళీ ప్లేయర్లే. భారత్ తర్వాత అత్యధికంగా ఈ వేలంలో పాల్గొంటున్న ఆటగాళ్లు ఆస్ట్రేలియా వాళ్లు. ఆసీస్ నుంచి ఈసారి 57 మంది వేలంలో ఉన్నారు. ఆస్ట్రేలియా తర్వాత సౌతాఫ్రికా (52 మంది), వెస్టిండీస్ (33 మంది) నుంచి అత్యధిక ప్లేయర్లు వేలంలో పాల్గొంటున్నారు.
కనీస ధర రూ.2 కోట్లు
మినీ వేలంలో కనీస తమ కనీస ధను రూ.2 కోట్లకు పెట్టుకునే అవకాశాన్ని ఆటగాళ్లకు కల్పించింది ఐపీఎల్ యాజమాన్యం. అయితే భారత ఆటగాళ్లు ఎవరూ ఈ రేట్ను తీసుకోలేదు. ఈ మినీ వేలంలో మొత్తం 21 మంది తమ కనీస ధరను రూ.2 కోట్లుగా నిర్ణయించుకోగా.. వీళ్లంతా విదేశీ ప్లేయర్లే కావడం గమనార్హం. భారత వెటరన్ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, కేదార్ జాదవ్, మనీష్ పాండే తదితరులు తమ కనీస ధరను రూ.1 కోటిగా నమోదు చేసుకున్నారు. అజింక్య రహానే, జయదేవ్ ఉనద్కత్ ఇద్దరూ కూడా రూ.50 లక్షల కేటగిరీలో పేర్లు నమోదు చేసుకున్నారు.
రెండుకోట్ల బ్యాచ్
మినీ వేలంలో తమ కనీస ధరను రూ.2 కోట్లుగా 21 మంది నిర్ణయించారు. వీరిలో ఒక్క భారతీయుడు లేడు. మరి ఆ విదేశీ ఆటగాళ్ల జాబితాలో జేమీ ఓవర్టన్, క్రెగ్ ఓవర్టాన్, అదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, కేన్ విలియమ్సన్, రైలీ రూసో, రాసీ వాన్ డర్ డస్సెన్, ఏంజెలో మాథ్యూస్, నాథన్ కౌల్టర్ నైల్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, టామ్ బాంటన్, శామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్ ఉన్నారు.