
192 వికెట్లు తీసిన జడేజా
ఇప్పటివరకు భారత్ తరుపున 41 టెస్టు మ్యాచ్లు ఆడిన జడేజా 192 వికెట్లు సాధించాడు. కాగా, అశ్విన్ 37 టెస్టు మ్యాచ్ల్లోనే 200 వికెట్లు తీశాడు. ఆ తర్వాత స్థానంలో హర్భజన్ సింగ్ 46 టెస్టుల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. విండిస్తో జరగనున్న ఈ సిరిస్లో భజ్జీ రికార్డుని జడేజా బద్దలు కొట్టే అవకాశం ఉంది.

అత్యంత వేగంగా రెండొందల వికెట్లు
మొత్తంగా చూస్తే టెస్టుల్లో అత్యంత వేగంగా రెండొందల వికెట్లు సాధించిన జాబితాలో యాసిర్ షా(33), గ్రిమ్మిట్(36 టెస్టులు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. మూడో స్థానంలో అశ్విన్ కొనసాగుతున్నాడు. సోమవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో రవీంద్ర జడేజా ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

గురువారం నుంచి విండిస్తో తొలి వన్డే
విండిస్తో గురువారం నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టులో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనే యోచనలో టీమిండియా ఉంది. దీంతో జడేజాకు తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ఒకవేళ కుల్దీప్ యాదవ్ను తుది జట్టులో ఆడించాలని భావిస్తే జడేజాకు చోటు దక్కడం కష్టమే.

టీమిండియా అద్భుత ప్రదర్శన
విండిస్ పర్యటనలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఇప్పటికే ముగిసిన మూడు టీ20ల సిరిస్ను 3-0తో కైవసం చేసుకున్న కోహ్లీసేన.... అనంతరం జరిగిన వన్డే సిరిస్ను 2-0తో సొంతం చేసుకుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా... మిగిలిన రెండు వన్డేల్లో కోహ్లీసేన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఒక దశాబ్దంలో 20,000 పరుగులు
మూడు వన్డేల సిరిస్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 234 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతేకాదు ఒక దశాబ్దంలో 20,000 పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్మన్గా చరిత్ర సృష్టించాడు. దీంతో పాటు విండిస్పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.


Click it and Unblock the Notifications












