అటు బ్యాట్తో, ఇటు బంతితో
ఈడెన్ గార్డెన్స్లో అటు బ్యాట్తో, ఇటు బంతితో చిరస్మరణీయ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు రషీద్. దీంతో హైదరాబాద్ 14 పరుగుల తేడాతో కోల్కతాపై గెలిచి ఫైనల్లోకి చేరింది. ఈ మ్యాచ్లో 10 బంతుల్లో 34 పరుగులతో అజేయంగా నిలిచిన రషీద్.. తర్వాత బంతితో అద్భుతాలు చేసి కేవలం 19 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
30కంటే ఎక్కువ పరుగులు సాధించి
ఈ అద్భుత ప్రదర్శనతో రషీద్ ఐపీఎల్లో అత్యుత్తమ ఆల్రౌండర్ల జాబితాలోకి చేరాడు. ఐపీఎల్ ప్లేఆఫ్/నాకౌట్ మ్యాచ్ల్లో 30కంటే ఎక్కువ పరుగులు సాధించి.. మూడు అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. 2008లో దిల్లీతో జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు షేన్ వాట్సన్ 29 బంతుల్లో 52 పరుగులు చేశాడు. పది పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.
యూసఫ్ పఠాన్ 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి..
అదే ఏడాది ఫైనల్లో రాజస్థాన్ ఆటగాడు యూసఫ్ పఠాన్ 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి.. బ్యాట్తో 56 పరుగులు సాధించాడు. ఇక చివరిసారిగా 2010లో ముంబయి ఆటగాడు పోలార్డ్ ఆర్సీబీపై 13 బంతుల్లో 33 పరుగులు సాధించడమే కాకుండా.. అనంతరం 3 వికెట్లు తీసి 17 పరుగులే ఇచ్చాడు.
అత్యధిక స్ట్రైక్రేట్(340) నమోదు చేసిన ఆటగాడిగా
శుక్రవారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో రషీద్ మరిన్ని రికార్డులను సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ తరఫున అత్యధిక స్ట్రైక్రేట్(340) నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రషీద్ టీ20 ఫార్మాట్లో ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ అని సచిన్ ప్రశంసించిన విషయం తెలిసిందే.