కోహ్లీ ఇనిస్టాగ్రామ్లో పోస్టు
ఈ ఫోటోని తన ఇనిస్టాగ్రామ్లో పోస్టు చేసిన విరాట్ కోహ్లీ "ప్రకృతి సౌందర్యానికి దగ్గరగా రావడానికి మీకు అవకాశం వచ్చినప్పుడు, ఆలోచనలు ఆగిపోతాయి. ఆ మీరు క్షణంతో ఒకటవుతారు. ఆ సమయంలోనే మీరు దైవిక శక్తితో కలిసిపోతారు. సో గ్రేట్పుల్" అంటూ కామెంట్ పెట్టాడు.
|
వీడియోని పోస్టు చేసిన అనుష్క శర్మ
మరోవైపు అనుష్క శర్మ కూడా ఓ వీడియోని తన ఇనిస్టాగ్రామ్లో పోస్టు చేసింది. ఆ వీడియోలో విరాట్ కోహ్లీ అనుష్క శర్మ వైపు చూస్తుండగా... అనుష్క పర్వతాల దృశ్యాన్ని చిత్రీకరించింది. ప్రస్తుతం విరుష్క జోడీ భూటాన్లో అద్భుతమైన సమయం గడుపుతున్నారు. భూటాన్లోనే తన పుట్టినరోజును జరుపుకున్నాడు.
ప్రకృతి అందాలకు, స్వచ్ఛతకు మరో పేరు భూటాన్
ప్రకృతి అందాలకు, స్వచ్ఛతకు, ప్రశాంతతకు మరో పేరైన భూటాన్ లోయలో హాయిగా గడిపాడు. మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా అందరి ప్రశంసలు అందుకుంటోన్న విరాట్ కోహ్లీ ఫార్మాట్తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించాడు. 2008 ఆగస్టు 18న శ్రీలంక ప్రత్యర్థిగా వన్డే అరంగేట్రం చేసిన విరాట్ కొహ్లీ తన తొలి ఇన్నింగ్స్లో 12 పరుగులకే పెవిలియన్కు చేరాడు.
|
కోహ్లీ అరుదైన ఘనత
ఆ మరుసటి ఏడాదే వన్డే క్రికెట్లో తన తొలి సెంచరీ సాధించిన విరాట్ కొహ్లీ ఆ తర్వాత వెనుదిరగలేదు. భారత్ తరుపున ఇప్పటివరకు 239 వన్డేలాడిన కోహ్లీ 11,520 పరుగులు సాధించాడు. ఇందులో 43 సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు అత్యంత వేగంగా 10వేలు, 20వేల పరుగుల మైలురాళ్లు చేరిన తొలి క్రికెటర్గా అరుదైన ఘనత సాధించాడు.
సచిన్ తర్వాత విరాట్ కోహ్లీనే
82 టెస్టుల్లో 7066 పరుగులు, 72 టీ20ల్లో 2450 పరుగులు సాధించాడు. వన్డేల్లో కోహ్లీ మరో ఏడు సెంచరీలు సాధిస్తే వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డుని బద్దలు కొడతాడు. టెస్టుల్లో 26 సెంచరీలతో సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రెండో స్థానంలో ఉన్నాడు.