
మొదటి మ్యాచ్లో ఈసారి జరిగింది విడ్డూరం
'సాధారణంగా టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్కు మొదటి మ్యాచ్లో అన్ని రకాల ప్రయోజనాలుంటాయి. పరిస్థితులు, పిచ్, కండీషన్లు అన్నీ కూడా కలిసొస్తాయి. పైగా స్వదేశం కాబట్టి మాకు కాస్త ఎడ్జ్ ఉంటుంది. అయితే ఈసారి జరిగింది మాత్రం విడ్డూరం. మా జట్టు టెస్టు ఆటతీరును వేరే రకంగా మార్చుతాం అనే మాటలు మాట్లాడుతోంది.
అది ఇప్పుడు అనవసరం. నేను అడుగుతున్నా మనం ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడాలి. సరైన ప్రాక్టీస్ ఉన్నప్పుడే కదా.. ఆ విషయాన్ని జట్టు మర్చిపోతుంది. టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరుగుతున్నప్పుడు అంతకుముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్పై ప్లేయర్లు ఆసక్తి చూపట్లేదని స్పష్టమవుతుంది' అని కుక్ పేర్కొన్నాడు.

ముందు అది మారాలి
ఇక 'బాజ్బాల్' ఫిలాసఫీని ఇంగ్లాండ్ ప్రవేశపెట్టిన తర్వాత.. ఇంగ్లాండ్ తొలిసారి టెస్ట్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఓటమికి ఎలాంటి సాకులు చెప్పకూడదని, ఏదైనా ప్రధాన టెస్ట్ సిరీస్లకు ముందు ఫస్ట్-క్లాస్ గేమ్లపై ప్లేయర్లు ఎక్కువ దృష్టి పెట్టాలని కుక్ అభిప్రాయపడ్డాడు. 'నేరుగా గ్రౌండ్లోకి వెళ్లి ఆడాలనుకోవడం కరెక్ట్ కాదు. అది మారాలి' అని కుక్ ఖరాఖండిగా చెప్పాడు. ఇంగ్లాండ్ ఆగస్టు 25న దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో తలపడనుంది. మూడో టెస్టు సెప్టెంబర్ 8న ప్రారంభం కానుంది.

రఫ్ఫాడించిన రబాడ
తొలి టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడ మెరుపుదాడికి తెగబడ్డాడు. అతను మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీసి రాణించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 165పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 326పరుగుల స్కోరు చేసి 161పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లలో అలెక్స్ లీస్ (35), స్టువర్ట్ బ్రాడ్ (35) మినహా మిగతావాళ్లు తుస్సుమనిపించారు. దీంతో 149పరుగులకే ఆ జట్టు చాప చుట్టేసింది. తద్వారా ఇన్నింగ్స్ 12పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలుపొందింది.


Click it and Unblock the Notifications












