కరాచీ: పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ భారత బౌలర్ల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ టాప్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్ల బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉందని అతను సంచలన ఆరోపణలు చేశాడు.
వాళ్లిద్దరూ చకింగ్ చేస్తారని... ఆ విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుందన్నాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో భజ్జీ చేయి పదిహేను డిగ్రీల కంటే ఎక్కువ వంగుతుందని, నిబంధనల ప్రకారం దీన్ని చకింగ్గానే భావించాలని చెప్పాడు.
పాకిస్థాన్కు చెందిన ప్రముఖ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజ్మల్ పై వ్యాఖ్యలు చేశాడు. కాగా, చకింగ్ చేస్తున్నాడని నిరూపితం కావడంతో, అజ్మల్ ప్రస్తుతం బహిష్కరణ వేటు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయాన్ని స్పోర్ట్స్ యాంకర్, ఎనలిస్ట్ అబ్బాస్ ట్వీట్ చేశాడు. భజ్జీ చకింగ్ పైన అజ్మల్ సవాల్ చేశాడని ట్విట్టర్లో పేర్కొన్నాడు.