
ధృవీకరించిన రాహుల్ జోహ్రి
దీనిని సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైన బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ)కు పంపిన విషయాన్ని రాహుల్ జోహ్రి ధృవీకరించాడు. ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ రహానే విజ్ఞప్తిని నిరాకరించడానికి ఎలాంటి కారణం లేదని ఆయన తెలిపారు.

గతంలో పలువురు క్రికెట్లరకు
గతంలో పలువురు క్రికెట్లరకు కౌంటీల్లో ఆడేందుకు బోర్టు అనుమతి ఇచ్చిందని, రహానే విషయంలో కూడా సానుకూలంగానే స్పందిస్తుందనే ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతేకాదు రహానే వరల్డ్కప్ జట్టులో సభ్యుడు కాదని, ఆ సమయంలో భారత జట్టు సైతం ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటం లేదని ఆయన గుర్తుచేశారు.

గతేడాది కోహ్లీ సర్రే జట్టు తరఫున
"గతేడాది కోహ్లీ సర్రే జట్టు తరఫున ఆడటానికి బీసీసీఐ అనుమతి ఇచ్చింది. పుజారా, ఇషాంత శర్మలు కూడా కౌంటీ క్రికెట్ ఆడారు. కాబట్టి రహానేకు కౌంటీల్లో ఆడేందుకు తప్పక అనుమతి లభిస్తుంది. అందులోనే రహానే వరల్డ్కప్ జట్టులో కూడా లేడు. ఈ సమయంలో భారత జట్టు సైతం ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటం లేదు" అని అన్నారు.

కౌంటీల్లో ఆడటం వల్ల మంచి అనుభవం
అంతేకాదు రహానే కౌంటీల్లో ఆడటం వల్ల మంచి అనుభవం సంపాదిస్తాడని అది టీమిండియా తరఫున టెస్టుల్లో ఆడేందుకు ఉపయోగపడుతుందని బీసీసీఐ అధికారి వివరించారు.


Click it and Unblock the Notifications
