
రహానేను తప్పించలేమన్న కుంబ్లే
గత ఐదారు మ్యాచుల్లో ప్రదర్శనను చూసి రహానేను తప్పించలేమని కుంబ్లే అన్నాడు. ‘రహానెను తప్పించే ప్రశ్నే లేదు. ఇంతకు ముందు అతడు చాలా పరుగులు చేశాడు. గత రెండు మూడేళ్లలో విజయవంతంగా ఆడాడు. జట్టు కూర్పు గురించి ఇంకా చర్చించలేదు. 16 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు' అని కుంబ్లే తెలిపాడు.

పూణె ఫలితం ఇప్పుడు గతం
పూణె ఫలితం ఇప్పుడు గతమని, జట్టు కోచ్గా తాను భవిష్యత్తుపైనే దృష్టి పెడతానని ఆయన అన్నారు. ‘మేం మా స్థాయికి తగినట్లుగా ఆడలేదు కాబట్టే ఓడిపోయాం. అలాంటి తప్పు ఇక్కడ జరగకుండా జాగ్రత్త పడతాం. జరిగినదాని గురించి చర్చ అనవసరం. సిరీస్లో మరో మూడు టెస్టులు ఉన్నాయి. ఆస్ట్రేలియా మెరుగైన జట్టే అనే విషయం మరచిపోవద్దు. ఈ టెస్టులో ఎలా విజయం సాధించాలనేదానిపైనే మా దృష్టి' అని కుంబ్లే అన్నాడు.

కరుణ్ నాయర్ ఇంకా కొన్నాళ్లు వేచి చూడాల్సిందే
ఇక కరుణ్ నాయర్ ఇంకా వేచి చూడాల్సిందేనని ఆయన అన్నారు. ‘ట్రిపుల్ సెంచరీ తర్వాత కూడా కరుణ్కు అవకాశం రాకపోవడం దురదృష్టకరం కానీ తప్పదు. తుది జట్టుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐదుగురు బౌలర్లను కొనసాగించాలా, లేదా నలుగురు బౌలర్లతో ఆడి మరో బ్యాట్స్మన్కు అవకాశం ఇవ్వాలా అనేది చెప్పలేను' అని కుంబ్లే చెప్పుకొచ్చాడు.

బెంగళూరు పిచ్ ఫలితాన్నిస్తుంది
ఇక, బెంగళూరు పిచ్ ఫలితాన్నిచ్చేలా ఉంటుందని కుంబ్లే వెల్లడించాడు. ఇక నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్) వినియోగం గురించి మాట్లాడడం తొందరపాటే అవుతుందని కుంబ్లే చెప్పాడు. ‘డీఆర్ఎస్ గురించి ఎటువంటి గందరగోళం లేదు. ఇంగ్లండ్, బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ల్లో ప్రత్యర్థి కంటే మెరుగ్గా డీఆర్ఎస్ను వినియోగించాం. అవసరమనుకున్నప్పుడే రివ్యూ అడిగాం. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు' అని అన్నాడు.

ఆటగాళ్లు ట్రెక్కింగ్పై ఇలా
తొలి టెస్టులో అనూహ్య ఫలితం తర్వాత ఆటగాళ్లు ట్రెక్కింగ్కు వెళ్లినట్టు అనిల్ కుంబ్లే చెప్పాడు. ‘మనసును ఉల్లాసపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఓటమి తర్వాత క్రికెట్కు దూరంగా ట్రెక్కింగ్కు వెళ్లాం. గత 10 నెలలుగా నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాం. బ్రేక్ అనేది కావాలి' అని కుంబ్లే చెప్పాడు.


Click it and Unblock the Notifications